పెళ్లింట విషాదం | The Tragedy Of The Wedding | Sakshi
Sakshi News home page

పెళ్లింట విషాదం

Apr 28 2018 12:53 PM | Updated on Sep 2 2018 4:46 PM

The Tragedy Of The Wedding - Sakshi

సోంపేట సామాజిక ఆస్పత్రిలో డిల్లీదొలాయి మృతదేహం 

కంచిలి : పెళ్లింట విషాదఛాయలు అలుముకున్నాయి. సోదరుడి కుమారుడి వివాహ వేడుకలో అంతా తానై వ్యవహరించి.. శుభకార్యం ముగిసిన తర్వాత సేద తీరేందుకు ఇంటికి వెళ్లిన వ్యక్తి విద్యుదాఘాతానికి గురయ్యారు. ఈ విషాదకర సంఘటన కంచిలి మండలంలోని తలతంపర పంచాయతీ పరిధి లండ పుట్టుగ గ్రామంలో శుక్రవారం  జరిగింది. లండపుట్టుగ గ్రామానికి చెందిన డిల్లీ దొలాయి(58)వ్యక్తి తన సోదరుని కుమారుడు వివాహ వేడుకల్లో అంతా తానై పనులు నిర్వహించారు.

మధ్యాహ్నం ఆయన భోజనం చేసి పక్కనే ఉన్న తన సొంత ఇంట్లో విశ్రాంతి తీసుకునేందుకు వెళ్లి.. ఫ్యాన్‌ వేయగా, ప్లగ్‌ వైర్‌ తెగి ఉండడంతో   విద్యుదాఘాతానికి గురయ్యారు. వెంటనే కుటుంబసభ్యులు సోంపేట ప్రభుత్వ ఆస్పత్రికి హుటాహుటిన తరలించారు.

అక్కడ పరీక్షించిన వైద్యులు మృతిచెందినట్లు ధ్రువీకరించారు. ఈ విషయంపై మృతుడి కుమారుడు దుల్లభ దోలాయి ఇచ్చిన ఫిర్యాదు మేరకు కంచిలి ఎస్‌.ఐ ఇ.శ్రీనివాస్‌ కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. ఈ ఘటనతో కుటుంబంతో పాటు, గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. ఆయన మృతి వార్త తెలియగానే తలతంపర పంచాయతీ పరిసర గ్రామాల్లోని బంధువులు లండ పుట్టుగకు చేరుకుని కుటుంబసభ్యులను పరామర్శించారు.  

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement