బస్సును ఢీకొన్న లారీ | lorry- bus collision in annanagar | Sakshi
Sakshi News home page

బస్సును ఢీకొన్న లారీ

Feb 26 2017 12:07 PM | Updated on Aug 30 2018 4:10 PM

బస్సును ఢీకొన్న లారీ - Sakshi

బస్సును ఢీకొన్న లారీ

లారీ అదుపుతప్పి ముందువెళుతున్న బస్సును రాసుకుంటూ వెళ్లడంతో బస్సు డివైడర్‌ను ఢీకొంది.

చెన్నై(అన్నానగర్‌):
బస్సును, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కృష్ణగిరి సమీపంలో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం హోసూరు నుంచి సేలం వైపుగా ప్రభుత్వ బస్సు 48 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ బస్సులో వేలమ్‌పట్టికి చెందిన రాజేంద్రన్‌ (43) డ్రైవర్‌గా,  కండక్టరుగా బాలకోడు సమీపంలో ఉన్న మగేంద్రమంగళానికి చెందిన శరవణన్‌ విధులు నిర్వహిస్తున్నారు.  

బస్సు కృష్ణగిరి సమీపం దిప్పణపల్లికూట్‌రోడ్డు వద్ద వస్తుండగా, అదే మార్గంలో హోసూరు నుంచి కృష్ణగిరికి ఓ లారీ బస్సు వెనుకే వస్తోంది. ఈ క్రమంలో హఠాత్తుగా లారీ టైర్‌ పేలింది. లారీ అదుపుతప్పి ముందువెళుతున్న బస్సును రాసుకుంటూ వెళ్లడంతో బస్సు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కృష్ణగిరి ట్రాఫిక్‌ నేర విభాగ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి తీవ్రగాయాలతో ఉన్న ఐదుగురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement