చెన్నై(అన్నానగర్):
బస్సును, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కృష్ణగిరి సమీపంలో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం హోసూరు నుంచి సేలం వైపుగా ప్రభుత్వ బస్సు 48 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ బస్సులో వేలమ్పట్టికి చెందిన రాజేంద్రన్ (43) డ్రైవర్గా, కండక్టరుగా బాలకోడు సమీపంలో ఉన్న మగేంద్రమంగళానికి చెందిన శరవణన్ విధులు నిర్వహిస్తున్నారు.
బస్సు కృష్ణగిరి సమీపం దిప్పణపల్లికూట్రోడ్డు వద్ద వస్తుండగా, అదే మార్గంలో హోసూరు నుంచి కృష్ణగిరికి ఓ లారీ బస్సు వెనుకే వస్తోంది. ఈ క్రమంలో హఠాత్తుగా లారీ టైర్ పేలింది. లారీ అదుపుతప్పి ముందువెళుతున్న బస్సును రాసుకుంటూ వెళ్లడంతో బస్సు డివైడర్ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కృష్ణగిరి ట్రాఫిక్ నేర విభాగ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి తీవ్రగాయాలతో ఉన్న ఐదుగురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.
బస్సును ఢీకొన్న లారీ
Published Sun, Feb 26 2017 12:07 PM
Advertisement
YSRCPలో ఉత్సాహం.. కూటమిలో నైరాశ్యం
అసహ్యంగా దూషించాడు.. అందుకే కొట్టా: ఎమ్మెల్యే శివకుమార్
AP Assembly Election 2024: ఎన్టీఆర్ షర్ట్పై నెట్టింట రచ్చ!
91 ఏళ్ల సుబ్బమ్మ.. ఫోర్బ్స్ బిలియనీర్
కట్టె కాలే వరకు పిఠాపురంలోనే ఉంటా: వంగా గీత భావోద్వేగం
ఈ వారం ఓటీటీల్లోకి ఏకంగా 22 సినిమాలు.. ఆ నాలుగు మాత్రం స్పెషల్
అమ్మా... నా పేరు గుర్తుందా?
నేను లోకల్.. గెస్ట్ పొలిటిషియన్ కాదు
తప్పక చదవండి
- ధాన్యానికి ‘తేమ’ కొర్రీ
- కొనసాగుతున్న ఉపరితల ఆవర్తనం
- కొత్త గణేశునిపాడులో బీభత్సకాండ
- 13 సీట్లు మాకే!
- 10 పక్కా.. 12 వచ్చినా ఆశ్చర్యపోవద్దు!
- చంద్రగిరిలో టీడీపీ దౌర్జన్యకాండ
- తెలంగాణ లోక్సభ ఎన్నికల ఫైనల్ పోలింగ్ 65.67 శాతం
- మోదీకి సొంత ఇళ్లు, కారు కూడా లేదట!.. ప్రధాని ఆస్తులివే..
- స్వాతిమలివాల్పై దాడి.. ఆందోళనకు దిగిన బీజేపీ కార్పొరేటర్లు
- టీడీపీ కార్యకర్తల్లా పోలీసులు: అనిల్కుమార్ ఆగ్రహం
Advertisement