బస్సును ఢీకొన్న లారీ | Sakshi
Sakshi News home page

బస్సును ఢీకొన్న లారీ

Published Sun, Feb 26 2017 12:07 PM

బస్సును ఢీకొన్న లారీ - Sakshi

చెన్నై(అన్నానగర్‌):
బస్సును, లారీ ఢీకొన్న ప్రమాదంలో ఐదుగురు తీవ్రంగా గాయపడ్డారు. ఈ సంఘటన కృష్ణగిరి సమీపంలో చోటుచేసుకుంది. శుక్రవారం సాయంత్రం హోసూరు నుంచి సేలం వైపుగా ప్రభుత్వ బస్సు 48 మంది ప్రయాణికులతో బయలుదేరింది. ఈ బస్సులో వేలమ్‌పట్టికి చెందిన రాజేంద్రన్‌ (43) డ్రైవర్‌గా,  కండక్టరుగా బాలకోడు సమీపంలో ఉన్న మగేంద్రమంగళానికి చెందిన శరవణన్‌ విధులు నిర్వహిస్తున్నారు.  

బస్సు కృష్ణగిరి సమీపం దిప్పణపల్లికూట్‌రోడ్డు వద్ద వస్తుండగా, అదే మార్గంలో హోసూరు నుంచి కృష్ణగిరికి ఓ లారీ బస్సు వెనుకే వస్తోంది. ఈ క్రమంలో హఠాత్తుగా లారీ టైర్‌ పేలింది. లారీ అదుపుతప్పి ముందువెళుతున్న బస్సును రాసుకుంటూ వెళ్లడంతో బస్సు డివైడర్‌ను ఢీకొంది. ఈ ప్రమాదంలో బస్సులో ఉన్న ఐదుగురికి తీవ్ర గాయాలయ్యాయి. సమాచారం అందుకున్న కృష్ణగిరి ట్రాఫిక్‌ నేర విభాగ పోలీసులు సంఘటన స్థలానికి వచ్చి తీవ్రగాయాలతో ఉన్న ఐదుగురిని ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement