మోత్కూరు మార్కెట్‌కు వచ్చిన కోదండరాం | kodandaram visits motkur market | Sakshi
Sakshi News home page

మోత్కూరు మార్కెట్‌కు వచ్చిన కోదండరాం

Apr 28 2017 1:09 PM | Updated on Jul 29 2019 2:51 PM

యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు వ్యవసాయ మార్కెట్‌ను తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం సందర్శించారు.

మోత్కూరు: యాదాద్రి భువనగిరి జిల్లా మోత్కూరు వ్యవసాయ మార్కెట్‌ను తెలంగాణ జేఏసీ చైర్మన్‌ ప్రొఫెసర్‌ కోదండరాం సందర్శించారు. సింగిల్‌ విండో ఆధ్వర్యంలో ధాన్యం కొనుగోలు జరుగుతున్న తీరును పరిశీలించారు. రైతులతో సమావేశమై లభిస్తున్న గిట్టుబాటు ధరల గురించి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కోదండరాం గో బ్యాక్ అంటూ టీఆర్‌ఎస్‌ నాయకులు నినాదాలు చేశారు. జేఏసీ నాయకులు, టీఆర్‌ఎస్‌ నాయకుల మధ్య వాగ్వాదం జరిగింది. రైతు జేఏసీ కో కన్వీనర్‌ కోదండరెడ్డి తదితరులు ఆయన వెంట ఉన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement