అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం వెంకటాంపల్లి పెద్దతండాలో విషాదం చోటు చేసుకుంది.
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
May 22 2017 3:14 PM | Updated on Oct 1 2018 2:36 PM
వజ్రకరూర్: అనంతపురం జిల్లా వజ్రకరూర్ మండలం వెంకటాంపల్లి పెద్దతండాలో విషాదం చోటు చేసుకుంది. పెద్దతండాకు చెందిన వడిత్యా కాసునాయక్(58) అనే రైతు అప్పుల బాధతో ఆత్మహత్య చేసుకున్నాడు. తన పొలంలొనే పురుగులమందు సేవించి ఆత్మహత్యకు పాల్పడ్డాడు. కొన ఊపిరితో ఉన్న అతనిని హుటాహుటిన ఉరవకొండ ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అయితే అప్పటికే ఆయన మృతి చెందినట్లు వైద్యులు ధ్రువీకరించారు. రైతుకు సుమారు రూ.6 లక్షల మేర అప్పు ఉన్నట్లు కుటుంబసభ్యులు చెబుతున్నారు.
Advertisement
Advertisement