ఢిల్లీ ఎమ్మెల్యేలపై దాడి | Congress MLA allegedly attacked in Lucknow | Sakshi
Sakshi News home page

ఢిల్లీ ఎమ్మెల్యేలపై దాడి

Apr 19 2014 12:13 AM | Updated on Sep 2 2017 6:12 AM

విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న ఢిల్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే హసన్ అహ్మద్‌పై లక్నో యువకులు కొందరు శుక్రవారం దాడి చేశారు.

 లక్నో: విలేకరుల సమావేశం నిర్వహిస్తున్న ఢిల్లీ కాంగ్రెస్ ఎమ్మెల్యే హసన్ అహ్మద్‌పై లక్నో యువకులు కొందరు శుక్రవారం దాడి చేశారు. ఉత్తరప్రదేశ్ కాంగ్రెస్ ఎన్నికల పర్యవేక్షకుడిగా వ్యవహరిస్తున్న హసన్ లక్నో హోటల్‌లో సమావేశం నిర్వహిస్తున్నప్పుడు 15-20 మం ది యువకులు దాడి చేశారు. స్థానిక షియా మతగురువు కల్బే జవ్వాద్‌కు వ్యతిరేకమని ఆరోపిస్తూ తనపై దాడి చేశారని బాధితుడు తెలిపారు. దీనిపై పోలీసులకు ఫిర్యాదు చేశానని ఢిల్లీలోని ముస్తాఫాబాద్ ఎమ్మెల్యే అయిన హసన్ అన్నారు. కాంగ్రెస్‌కు ముస్లిమ్‌లు ఓటేయవద్దని జువ్వాద్ ఇటీవల కోరారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement