పట్టాదార్ పాస్ పుస్తకాల్లో పేర్లు మార్చడానికి రూ. 5 వేలు లంచం డిమాండ్ తీసుకుంటున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు.
ఏసీబీకి చిక్కిన వీఆర్వో
Mar 23 2017 12:34 PM | Updated on Aug 17 2018 12:56 PM
ఆలమూరు: పట్టాదార్ పాస్ పుస్తకాల్లో పేర్లు మార్చడానికి రూ. 5 వేలు లంచం డిమాండ్ తీసుకుంటున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామ వీఆర్వోగా పని చేస్తున్న పి. బాబురావు అదే గ్రామానికి చెందిన ఓ రైతు పాస్ పుస్తకాల్లో పేరు మార్చడానికి రూ. 10 వేలు లంచం డిమాండ్ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాబురావు రూ.5 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్ హ్యాండెడ్గా పట్టుకున్నారు.
Advertisement
Advertisement