ఏసీబీకి చిక్కిన వీఆర్వో | Sakshi
Sakshi News home page

ఏసీబీకి చిక్కిన వీఆర్వో

Published Thu, Mar 23 2017 12:34 PM

acb caught vro in east godavari district

ఆలమూరు: పట్టాదార్‌ పాస్‌ పుస్తకాల్లో పేర్లు మార్చడానికి రూ. 5 వేలు లంచం డిమాండ్‌ తీసుకుంటున్న వీఆర్వోను ఏసీబీ అధికారులు అరెస్ట్‌ చేశారు. తూర్పుగోదావరి జిల్లా ఆలమూరు మండలం జొన్నాడ గ్రామ వీఆర్వోగా పని చేస్తున్న పి. బాబురావు అదే గ్రామానికి చెందిన ఓ రైతు పాస్‌ పుస్తకాల్లో పేరు మార్చడానికి రూ. 10 వేలు లంచం డిమాండ్‌ చేశాడు. దీంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు బాబురావు రూ.5 వేలు లంచం తీసుకుంటున్న సమయంలో రెడ్‌ హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. 
 

Advertisement
Advertisement