టైటిల్‌ పోరులో సిక్కి–అశ్విని జంట

Sourabh Verma, Ashwini Ponnappa-Sikki Reddy Enter Final - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: ఈ ఏడాది తొలి అంతర్జాతీయ డబుల్స్‌ టైటిల్‌ సాధించేందుకు నేలకుర్తి సిక్కి రెడ్డి–అశ్విని పొన్నప్ప (భారత్‌) జంట విజయం దూరంలో నిలిచింది. గచ్చిబౌలి ఇండోర్‌ స్టేడియంలో జరుగుతున్న హైదరాబాద్‌ ఓపెన్‌ వరల్డ్‌ టూర్‌ సూపర్‌–100 టోర్నమెంట్‌లో మహిళల డబుల్స్‌ విభాగంలో టాప్‌ సీడ్‌ సిక్కి రెడ్డి–అశ్విని ద్వయం ఫైనల్లోకి అడుగు పెట్టింది. శనివారం జరిగిన సెమీఫైనల్లో సిక్కి–అశ్విని జంట 21–12, 21–12తో ఫాన్‌ కా యాన్‌–వు యి టింగ్‌ (హాంకాంగ్‌) ద్వయంపై విజయం సాధించింది. నేడు జరిగే ఫైనల్లో బేక్‌ హా నా–జుంగ్‌ క్యుంగ్‌ యున్‌ (దక్షిణ కొరియా) జోడీతో సిక్కి–అశ్విని జంట తలపడుతుంది.  

ఫైనల్లో సౌరభ్‌...
పురుషుల సింగిల్స్‌ విభాగంలో భారత జాతీయ చాంపియన్‌ సౌరభ్‌ వర్మ టైటిల్‌ పోరుకు అర్హత సాధించాడు. సెమీఫైనల్లో ఏడో సీడ్‌ సౌరభ్‌ 23–21, 21–16తో ఇస్కందర్‌ జుల్కర్‌నైన్‌ (మలేసియా)పై గెలిచాడు. నేడు జరిగే ఫైనల్లో లో కీన్‌ యె (సింగపూర్‌)తో సౌరభ్‌ తలపడతాడు.  

Read latest Sports News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top