గురువారం ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో సిడ్నీ ఆనవాయితీ కొనసాగొచ్చని క్రికెట్ అభిమానులు తెలిపారు.
గురువారం ఆస్ట్రేలియా వర్సెస్ భారత్ మధ్య జరుగుతున్న మ్యాచ్లో సిడ్నీ ఆనవాయితీ కొనసాగొచ్చని క్రికెట్ అభిమానులు తెలిపారు. సిడ్నీ క్రికెట్ గ్రౌండ్లో ఆస్ట్రేలియాకు ఘనమైన రికార్డు ఉంది. ఈ వేదికపై భారత్, ఆసీస్ ఇంతకుముందు 13 మ్యాచ్లాడగా మనోళ్లు కేవలం ఒక్క మ్యాచే గెలిచారు. అయితే, ఇటీవల సిడ్నీకో ఆనవాయితీ ఉంది. సిడ్నీలో 2011 నుంచి ఈ వేదికపై 9 వన్డేలు జరగ్గా, ఛేజింగ్ చేసిన జట్లే నెగ్గాయి. ప్రపంచ కప్ తాజా సెమీస్ మ్యాచ్లోనూ ఇదే ఆనవాయితీ కొనసాగేనా? టీమిండియా విజయం సాధించి ఫైనల్ చేరేనా? అంటూ సాక్షి.. ఫేస్బుక్ ద్వారా క్రికెట్ అభిమానులను ప్రశ్నించగా ఆ ఆనవాయితీ నిజం అవుతుందని, నిజమవ్వాలని అందరం కోరుకుందామని అన్నారు. కొద్దిమంది మాత్రం అలా జరగకపోవచ్చని చెప్పారు.