కివీస్‌తో టీ20 : టాస్‌ గెలిచిన భారత్‌ | India Womens Won The Toss And Elected To Field First | Sakshi
Sakshi News home page

Feb 6 2019 8:41 AM | Updated on Feb 6 2019 11:33 AM

India Womens Won The Toss And Elected To Field First - Sakshi

వెల్లింగ్టన్‌ : న్యూజిలాండ్‌ మహిళలతో జరుగుతున్న తొలి టీ20లో భారత మహిళలు టాస్‌ గెలిచి ఫీల్డింగ్‌ ఎంచుకున్నారు.  వెటరన్‌ మిథాలీ రాజ్‌ను ఆడించక పోవడంతో పాటు ఓటమి కారణంగా చేదు జ్ఞాపకంగా మిగిలిన టీ20 ప్రపంచ కప్‌ సెమీఫైనల్‌ తర్వాత... భారత మహిళల క్రికెట్‌ జట్టు తొలిసారిగా పొట్టి ఫార్మాట్‌ బరిలో దిగుతోంది.

ఇప్పటికే 2-0తో వన్డే సిరీస్‌ను కైవసం చేసుకున్న భారత మహిళలు టీ20 సిరీస్‌ను కూడా నెగ్గి కివీస్‌ పర్యటనను ఘనంగా ముగించాలని భావిస్తున్నారు. ఇక ఈ మ్యాచ్‌ ద్వారా అంతర్జాతీయ టీ20ల్లోకి ప్రియాపునియా అరంగేట్రం చేయగా.. సీనియర్‌ క్రికెటర్‌ మిథాలీ రాజ్‌ను తుదిజట్టులోకి తీసుకోలేదు. తెలుగమ్మాయి అరుంధతి రెడ్డికి మాత్రం తుది జట్టులో అవకాశం దక్కింది. ఇదే వేదికపై మహిళల మ్యాచ్‌ అనంతరం భారత్, న్యూజిలాండ్‌ పురుషుల టీ20 మ్యాచ్‌ను నిర్వహిస్తారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement