ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత జట్టు ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది.
బిల్బావో (స్పెరుున్): ప్రపంచ జూనియర్ మిక్స్డ్ టీమ్ బ్యాడ్మింటన్ చాంపియన్షిప్లో భారత జట్టు ఎనిమిదో స్థానంతో సరిపెట్టుకుంది. 7-8 స్థానాల కోసం డెన్మార్క్తో జరిగిన వర్గీకరణ మ్యాచ్లో భారత్ 2-3తో ఓడిపోరుుంది. మిక్స్డ్ డబుల్స్ మ్యాచ్లో సాత్విక్ సారుురాజ్-మహిమా అగర్వాల్ జంట... బాలుర సింగిల్స్ మ్యాచ్లో లక్ష్య సేన్ నెగ్గడంతో భారత్ 2-0తో ఆధిక్యంలోకి వెళ్లింది.
అరుుతే బాలికల సింగిల్స్ మ్యాచ్లో ఆకర్షి కశ్యప్, బాలుర డబుల్స్ మ్యాచ్లో సాత్విక్ సారుురాజ్-కృష్ణప్రసాద్... బాలికల డబుల్స్ మ్యాచ్లో మహిమా అగర్వాల్-మిథుల జోడీలు పరాజయం పాలవ్వడంతో భారత్ 2-3తో ఓటమి మూటగట్టుకుంది.