లంక మాజీ క్రికెటర్లు జోయ్సా, గుణవర్ధనేలపై ఐసీసీ సస్పెన్షన్‌  | Sakshi
Sakshi News home page

లంక మాజీ క్రికెటర్లు జోయ్సా, గుణవర్ధనేలపై ఐసీసీ సస్పెన్షన్‌ 

Published Sat, May 11 2019 12:50 AM

ICC suspends former cricketers Jaya and Gunawardana - Sakshi

గతేడాది డిసెంబరులో యూఏఈలో జరిగిన టి10 లీగ్‌లో అవినీతికి పాల్పడినందుకు శ్రీలంక మాజీ ఆటగాళ్లు నువాన్‌ జోయ్సా, అవిష్క గుణవర్ధనేలను అంతర్జాతీయ క్రికెట్‌ మండలి (ఐసీసీ) సస్పెండ్‌ చేసింది. జోయ్సాపై నాలుగు, గుణవర్ధనేపై మూడు అభియోగాలు మోపిన ఐసీసీ వీటికి 14 రోజుల్లోగా వివరణ ఇవ్వాలని కోరింది. కాగా, ఐసీసీ అవినీతి నిరోధక నిబంధనావళిని ఉల్లంఘించినందుకు జోయ్సా ఇప్పటికే సస్పెన్షన్‌ ఎదుర్కొంటున్నాడు.    

Advertisement
Advertisement