ఇంగ్లండ్‌ 290/8 | Bairstow takes England to 290/8 on Day 1 | Sakshi
Sakshi News home page

ఇంగ్లండ్‌ 290/8

Mar 31 2018 4:46 AM | Updated on Oct 17 2018 4:43 PM

Bairstow takes England to 290/8 on Day 1 - Sakshi

బెయిర్‌స్టో, సౌథీ

క్రైస్ట్‌చర్చ్‌: ఇంగ్లండ్, న్యూజిలాండ్‌ల మధ్య జరుగుతోన్న చివరిదైన రెండో టెస్టు తొలి రోజు ఇరు జట్లు సమ ఉజ్జీలుగా నిలిచాయి. తొలుత బ్యాటింగ్‌ చేసిన ఇంగ్లండ్‌ శుక్రవారం ఆట ముగిసే సమయానికి 8 వికెట్ల నష్టానికి 290 పరుగులు చేసింది. కివీస్‌ బౌలర్లు సౌథీ (5/60), బౌల్ట్‌ (3/79) చెలరేగడంతో ఓ దశలో ఇంగ్లండ్‌ 164 పరుగులకే 7 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది.

ఆ సమయంలో బెయిర్‌స్టో (97 బ్యాటింగ్‌; 11 ఫోర్లు, 1 సిక్స్‌) ఆదుకోవడంతో మెరుగైన స్కోరు చేయగలిగింది. టాస్‌ ఓడి బ్యాటింగ్‌కు దిగిన ఇంగ్లండ్‌కు శుభారంభం లభించలేదు. సీనియర్‌ బ్యాట్స్‌మన్‌ కుక్‌ (2) మరోసారి నిరాశ పరిచాడు. విన్స్‌ (18), స్టోన్‌మన్‌ (35), రూట్‌ (37), స్టోక్స్‌ (25) ఓ మోస్తరుగా ఆడారు. వుడ్‌ (52; 7 ఫోర్లు, 1 సిక్స్‌)తో కలిసి బెయిర్‌స్టో ఎనిమిదో వికెట్‌కు 95 పరుగులు జతచేసి జట్టును ఆదుకున్నాడు. అతనితో పాటు జాక్‌ లీచ్‌ (10 బ్యాటింగ్‌) ప్రస్తుతం క్రీజులో ఉన్నాడు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement