ఆనంద్ శుభారంభం | Anand started | Sakshi
Sakshi News home page

ఆనంద్ శుభారంభం

Mar 14 2014 1:09 AM | Updated on Sep 2 2017 4:40 AM

ఆనంద్ శుభారంభం

ఆనంద్ శుభారంభం

క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ శుభారంభం చేశాడు.


ఖాంటీ మన్‌సిస్క్ (రష్యా): క్యాండిడేట్స్ చెస్ టోర్నమెంట్‌లో భారత గ్రాండ్‌మాస్టర్ విశ్వనాథన్ ఆనంద్ శుభారంభం చేశాడు. గురువారం మొదలైన ఈ టోర్నీ తొలి రౌండ్‌లో ప్రపంచ మాజీ చాంపియన్ ఆనంద్ 47 ఎత్తుల్లో లెవాన్ అరోనియన్ (అర్మేనియా)పై విజయం సాధించాడు.

మొత్తం ఎనిమిది మంది అగ్రశ్రేణి గ్రాండ్‌మాస్టర్ల మధ్య డబుల్ రౌండ్ రాబిన్ లీగ్ పద్ధతిలో జరుగుతున్న ఈ టోర్నీలో విజేతగా నిలిచిన క్రీడాకారుడు ఈ ఏడాది చివర్లో ప్రపంచ చాంపియన్ మాగ్నస్ కార్ల్‌సన్‌తో వరల్డ్ చాంపియన్‌షిప్ మ్యాచ్‌లో పోటీపడతాడు.

శుక్రవారం జరిగే రెండో గేమ్‌లో వాసిలిన్ తొపలోవ్‌తో ఆనంద్ ఆడతాడు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement