వైఎస్‌ జగన్‌కు చిన్నారి కానుక

girl presents surprise gift To Ys Jagan mohan reddy - Sakshi

సాక్షి, ఒంగోలు : ప్రజాసంకల్పయాత్ర చేస్తున్న వైఎస్‌ జగన్‌ మోహన్‌ రెడ్డికి ఓ చిన్నారి డబ్బులు దాచుకున్న హుండీని కానుకగా ఇచ్చింది. ప్ర‌కాశం జిల్లా కొండెపి నియోజ‌క‌వ‌ర్గంలో 94వ రోజు పాదయాత్ర కొనసాగుతోంది.  ఈ సంద‌ర్భంగా ఓ చిన్నారి త‌న తండ్రితో పాటు ప్ర‌జాసంక‌ల్పయాత్ర‌లో పాల్గొని  తాను ఎప్ప‌టి నుంచో దాచిపెట్టిన డబ్బును వైఎస్ జ‌గ‌న్‌కు విరాళంగా ఇచ్చింది. ఆ చిన్నారి చూపిన ప్రేమ‌కు వైఎస్ జ‌గ‌న్ మంత్ర‌ముగ్ధుడై ఆమెను ఆప్యాయంగా ముద్దాడి ఆశీర్వ‌దించారు.  

మరోవైపు కె.అగ్ర‌హారం  గ్రామస్తులు జననేతను కలిసి వారి సమస్యలు చెప్పుకున్నారు. తీవ్ర నీటి ఎద్ద‌డి ఎదుర్కొంటున్నామ‌ని వాపోయారు. వారి స‌మస్య‌లు సావ‌ధానంగా విన్న వైఎస్ జ‌గ‌న్ మంచి రోజులు వ‌స్తాయ‌ని భ‌రోసా క‌ల్పించారు.

Read latest Prakasam News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top