
సాక్షి, ఒంగోలు: వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 94వ రోజు షెడ్యూలు ఖరారైంది. రేపు (బుధవారం) ఉదయం తిమ్మపాలెం శివారు నుంచి వైఎస్ జగన్ తన పాదయాత్రను ప్రారంభిస్తారు. చెరువుకొమ్ము పాలెం, కె.అగ్రహారం మీదుగా ప్రజలతో మమేకమైన అనంతరం జననేత వైఎస్ జగన్ పర్చూరివారిపాలెం చేరుకుని అక్కడ పార్టీ జెండాను ఆవిష్కరిస్తారు. భోజన విరామం అనంతరం మధ్యాహ్నం 2:45 గంటలకు పర్చూరివారిపాలెం నుంచి యాత్ర మొదలవుతోంది. కొండేపి నియోజకవర్గం నుంచి వైఎస్ జగన్ పాదయాత్ర కనిగిరి నియోజకవర్గంలోకి ప్రవేశిస్తుంది. వెంగళాపురం క్రాస్ మీదుగా మీదుగా కొనసాగనున్న పాదయాత్ర పెద్దఅలవలపాడుకు చేరుకుంటుంది. వైఎస్ జగన్ అక్కడ పార్టీ జెండా ఆవిష్కరిస్తారు. రాత్రికి పెద్దఅలవలపాడులోనే బస చేస్తారు. ఈ మేరకు వైఎస్ఆర్ సీపీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తలశిల రఘురాం ఓ ప్రకటన విడుదల చేశారు.
తిమ్మపాలెంలో ముగిసిన ప్రజాసంకల్పయాత్ర
మరోవైపు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి 93వ రోజు ప్రజాసంకల్పయాత్ర తిమ్మపాలెం వద్ద ముగిసింది. నేడు వైఎస్ జగన్ 13.5 కిలోమీటర్లు నడిచారు. మంగళవారం ఉదయం విప్పగుంట శివారు నుంచి వైఎస్ జగన్ పాదయాత్రను ప్రారంభించారు. అక్కడ నుంచి చౌటపాలెం, లింగంగుంట, మలెపాడు మీదగా కొనసాగిన పాదయాత్ర సాయంత్రానికి తిమ్మపాలెం చేరుకుంది. రైతుల సమస్యలు మరింత లోతుగా తెలుసుకునేందుకు తిమ్మపాలెంలో రైతులతో ఆత్మీయ సమ్మేళనంలో పాల్గొని రైతుల సమస్యలు అడిగి తెలుసుకున్నారు. తిమ్మపాలెంలో నేడు పాదయాత్ర ముగించిన వైఎస్ జగన్ రాత్రి అక్కడే బస చేయనున్నారు. పాదయాత్రలో భాగంగా వైఎస్ జగన్ ఇప్పటివరకు 1262.4 కి.మీ నడిచారు.