322వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర | YS Jagan 322nd Day Praja Sankalpa Yatra Started | Sakshi
Sakshi News home page

322వ రోజు ప్రారంభమైన ప్రజాసంకల్పయాత్ర

Dec 16 2018 8:43 AM | Updated on Dec 16 2018 8:58 AM

YS Jagan 322nd Day Praja Sankalpa Yatra Started - Sakshi

సాక్షి, శ్రీకాకుళం: వైఎస్సార్‌ కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షులు, ఏపీ ప్రతిపక్ష నేత వైఎస్‌ జగన్‌మోహన్‌ రెడ్డి చేపట్టిన ప్రజాసంకల్పయాత్ర 322వ రోజు ఆదివారం ఉదయం నరసన్నపేట నియోజకవర్గంలోని దేవాది శివారు నుంచి ప్రారంభమైంది. అక్కడి నుంచి కోమర్తి, గుండువిల్లిపేట, కరిమిల్లిపేట క్రాస్‌, సత్యవరం క్రాస్‌ మీదుగా జమ్ము జంక్షన్‌ వరకు జననేత పాదయాత్ర కొనసాగిస్తారు. సాయంత్రం నరసన్నపేటలో ఏర్పాటు చేసిన బహిరంగ సభలో వైఎస్‌ జగన్‌ ప్రసంగిస్తారు.

వైఎస్‌ జగన్‌ రాకతో పాదయాత్ర సాగుతోన్న మార్గంలో పండుగ వాతావరణం నెలకొంది. దారి పొడువునా ప్రజల సమస్యలు తెలుసుకుంటూ వైఎస్‌ జగన్‌ ముందుకు సాగుతున్నారు. జననేతను చూసేందుకు చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఉత్సాహం చూపిస్తున్నారు. వైఎస్‌ జగన్‌తో సెల్ఫీలు దిగేందుకు యువతీ యువకులు పోటీపడుతున్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement