పదహారో స్థానానికి ఎలా దిగజారాడు.. | Komatireddy Venkat Reddy Criticized CM KCR | Sakshi
Sakshi News home page

పదహారో స్థానానికి ఎలా దిగజారాడు: కోమటిరెడ్డి

Jun 5 2020 12:35 PM | Updated on Jun 5 2020 12:50 PM

Komatireddy Venkat Reddy Criticized CM KCR - Sakshi

సాక్షి, యాదాద్రి భువనగిరి: అన్నింట్లో తెలంగాణ రాష్ట్రం ముందుందని గొప్పలు చెప్పే ముఖ్యమంత్రి కేసీఆర్‌ ఇటీవల నిర్వహించిన ఓ సర్వేలో పదహారవ స్థానానికి ఎలా దిగజారడని యాదాద్రి ఎంపీ కోమటిరెడ్డి వెంకటరెడ్డి విమర్శించారు. గందమల్ల రిజర్వాయర్‌ నిర్మాణం లేదని అధికారులే చెబుతున్నారని, ఎన్నికల సమయంలో గందమల్ల రిజర్వాయర్‌ ఉందని ప్రజలను మోసం చేసిన ఆలేరు ఎమ్మెల్యే తన పదవికి రాజీనామా చేయాలని డిమాండ్‌ చేశారు. అప్పటి కాంగ్రెస్‌ పార్టీ తెచ్చిన ప్రాజెక్టులకు కొద్దిపాటి నిధులు కేటాయిస్తే పూర్తవుతాయి. కానీ వాటిని పూర్తి చేయకుండా కేసీఆర్‌ గొప్పలు చెప్పుకోడానికి ప్రజా సొమ్మును దుర్వినియోగం చేస్తూ కాంగ్రెస్‌ నాయకులపై నిందలు వేస్తున్నారన్నారు. కరోనా టెస్టుల విషయంలో హైకోర్టు మొట్టికాయలు వేసిన పరీక్షలు చేయడం లేదని దుయ్యబట్టారు. తెలంగాణ ప్రభుత్వం ప్రజలకు మేలు కంటే కీడు ఎక్కువగా చేస్తుందని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి ఆరోపించారు.

ఇన్‌స్టాగ్రామ్‌ యూజర్లకు గుడ్‌న్యూస్‌.. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement