ఫిర్యాదుల స్వీకరణకు అధికారి: వాట్సాప్‌

WhatsApp appoints grievance officer to curb fake news in India - Sakshi

న్యూఢిల్లీ: నకిలీ వార్తలు, వదంతులను అరికట్టేందుకు వాట్సాప్‌ చర్యలు చేపట్టింది. ఇందులో భాగంగా భారత్‌లో నకిలీ వార్తలపై ఫిర్యాదులు స్వీకరించేం దుకు కోమల్‌ లాహిరిని గ్రీవెన్స్‌ అధికారిగా నియమిస్తున్నట్లు తెలిపింది. వినియోగదారులు ఈ–మెయిల్, యాప్‌ లేదా రాతపూర్వకంగా ఆమెకు ఫిర్యాదు చేయవచ్చని సంస్థ పేర్కొంది. వాట్సప్‌లోని ‘సెట్టింగ్స్‌’ట్యాబ్‌లో ఉన్న ఆప్షన్‌ ద్వారా కంపెనీ సపోర్ట్‌ టీమ్‌ను సంప్రదించాలని,  అవసరమైతే గ్రీవెన్స్‌ అధికారికి సైతం ఫిర్యాదు చేయవచ్చని సూచించింది.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top