నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్‌ | Plea in SC seeks quashing of demonetisation decision | Sakshi
Sakshi News home page
breaking news

నోట్ల రద్దుపై సుప్రీంకోర్టులో పిటిషన్‌

Nov 10 2016 9:36 AM | Updated on Sep 27 2018 9:08 PM

పెద్దనోట్లను ఉపసంహరించాలన్న ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దుచేయాలని కోరుతూ సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది.

న్యూఢిల్లీ: పెద్ద నోట్లు రూ.500, 1000లను ఉపసంహరిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని రద్దు చేయాలని కోరుతూ బుధవారం సుప్రీంకోర్టులో పిటిషన్‌ దాఖలైంది. ఇది ప్రజల జీవించే హక్కు, వ్యాపార నిర్వహణ, తదితరా హక్కుల ఉల్లంఘనకు దారితీస్తుందని పిటిషనర్‌ ఆరోపించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంగళవారం జారీచేసిన ప్రకటన నిరంకుశంగా ఉందని, పాత నోట్లను మార్చుకునేందుకు ప్రజలకు కనీస సమయం ఇవ్వలేదని పేర్కొన్నారు.

పాతనోట్ల తొలగింపు ప్రక్రియలో ప్రభుత్వం సహజ న్యాయసూత్రాలకు కట్టుబడలేదని, రాజ్యాంగ సమన్యాయ విధానాన్ని ఆచరించడంలో విఫలమైందని తెలిపారు. ఫలితంగా సాధారణ పౌరుల వ్యాపారం, విద్య, దైనందిన జీవితంలో గందరగోళం నెలకొందని ఆరోపించారు. ప్రభుత్వ నిర్ణయాన్ని రద్దు చేయడమో లేదా ప్రజలు పాతనోట్లు మార్చుకోవడానికి తగిన సమయం ఇచ్చేలా ప్రభుత్వానికి ఆదేశాలు జారీచేయాలని కోరారు. ఢిల్లీ లాయర్‌ వివేక్‌ నారాయణ్‌ శర్మ దాఖలుచేసిన ఈ పిటిషన్‌ ఈ వారంలోనే విచారణకొస్తుంది. ఇదే అంశంపై ఉత్తరప్రదేశ్‌ కు చెందిన న్యాయవాది సంగంలాల్‌ పాండే కూడా పిటిషన్‌ వేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement