
‘డీమ్డ్’ నీట్ కౌన్సెలింగ్ సెప్టెంబర్ 7 వరకు
డీమ్డ్ యూనివర్సిటీల్లో వైద్య విద్య ప్రవేశాలకు నీట్ చివరి రౌండ్ కౌన్సెలింగ్ను సుప్రీంకోర్టు మంగళవారం సెప్టెంబర్ 7 వరకు పొడిగించింది.
న్యూఢిల్లీ: డీమ్డ్ యూనివర్సిటీల్లో వైద్య విద్య ప్రవేశాలకు నీట్ చివరి రౌండ్ కౌన్సెలింగ్ను సుప్రీంకోర్టు మంగళవారం సెప్టెంబర్ 7 వరకు పొడిగించింది. ఈ గడువు ఆగస్టు 31నే ముగియాల్సి ఉంది. ఈ సౌకర్యం డీమ్డ్ వర్సిటీలకే పరిమితమని, తదుపరి గడువులుండవని స్పష్టం చేసింది. గత రెండు కౌన్సెలింగ్లలో ఏ కాలేజీలోనూ సీట్లు పొందని విద్యార్థులను ‘మాప్ అప్ రౌండ్’గా పిలిచే ఈ దఫాలో అనుమతిస్తారు. డీమ్డ్ వర్సిటీల్లో ఖాళీగా ఉన్న 5,500 సీట్లను అర్హులైన 55 వేల విద్యార్థుల జాబితా నుంచి 1:10 నిష్పత్తిలో భర్తీ చేయనున్నారు.