అసోంలో స్వల్ప భూకంపం, 6 విద్యార్థులకు గాయాలు
అసోంలో బుధవారం భూమి స్వల్పంగా కంపించింది. రెక్టార్ స్కేలుపై దీని తీవ్రత 5.5గా నమోదైంది. ఈ సంఘటనలో పలు భవనాలకు పగుళ్లు ఏర్పడగా, ఆరుగురు విద్యార్థులు గాయపడ్డారు.
బుధవారం ఉదయం 10 గంటల ప్రాంతంలో భూమి కొన్ని సెకెన్ల పాటు కంపించినట్టు అధికారులు చెప్పారు. గోలాఘాట్ జిల్లాలో ఓ పాఠశాలకు పగుళ్లు ఏర్పడినట్టు తెలిపారు. పాఠశాలలో ఉన్న విద్యార్థులు భవనంపై నుంచి దూకగా ఆరుగురు గాయపడ్డారు. వీరిని చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలించారు. ఇతర ప్రభుత్వ పాఠశాలల భవనాలకు పగుళ్లు ఏర్పడినట్టు అధికారులు చెప్పారు. పాత భవనాలు కూడా కొన్ని దెబ్బతిన్నాయి.