మొరిగిందని..కుక్కను చంపాడు


మొరాదాబాద్‌(ఉత్తరప్రదేశ్‌): నడిచి వెళ్తున్న ఓ అధికారిని చూసి ఓ కుక్క మొరిగింది. ఆగ్రహించిన అతను తన వద్ద ఉన్న తుపాకీతో దానిని కాల్చి చంపాడు. దీనిపై కుక్క యజమాని ఫిర్యాదు మేరకు పోలీసులు ఆయన్ను అదుపులోకి తీసుకున్నారు.  మొరాదాబాద్‌ కన్షీరాంనగర్‌లో చోటుచేసుకుంది.

 

ప్రస్తుతం బిజ్నోర్‌ ఎస్సీ,ఎస్టీ సంక్షేమ శాఖ కార్యాలయం సూపరింటెండెంట్‌గా పనిచేస్తున్న విమల్‌ ధీర్‌(56) శనివారం సాయంత్రం వాకింగ్ వెళ్తుండగా అశోక్‌కుమార్‌ అనే వ్యక్తికి చెందిన పెంపుడు కుక్క మొరిగింది. దీంతో ఆగ్రహించిన విమల్‌ వెంటనే తన వద్ద ఉన్న తుపాకీతో దానిని కాల్చి చంపాడు. అశోక్‌కుమార్‌ ఆ పక్కనే గల కాలనీ నివాసి ఆ సమయంలో విమల్‌ మద్యం మత్తులో ఉన్నాడు.  ఖరీదైన తన పెంపుడు కుక్కను పొట్టనబెట్టుకున్నాడని ఆరోపించారు.  పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. ఐపీసీ 429కింద కేసు నమోదు చేసిన పోలీసులు ఆయన్ను అరెస్టు చేశారు. విమల్‌ మధ్యంతర బెయిల్‌పై బయటకు వచ్చారు. 
Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top