ఉత్తరాఖండ్‌లో కుప్పకూలిన హెలికాఫ్టర్‌

Helicopter Involved In Rescue Operation Crashes In Uttarakhand - Sakshi

హరిద్వార్‌ : వరద సహాయక చర్యల్లో పాల్గొంటున్న ఓ హెలికాఫ్టర్‌ ఉత్తరాఖండ్‌లోని ఉత్తరకాశీలో బుధవారం కుప్పకూలింది. ఈ ఘటనలో హెలికాఫ్టర్‌లో ఉన్న ముగ్గురు వ్యక్తులు మరణించారు. ప్రమాద సమయంలో చాపర్‌లో ఉన్న పైలట్‌ రాజ్‌పాల్‌, కో పైలట్‌ కప్తల్‌ లాల్‌, రమేష్‌ సవార్‌ అనే స్ధానికుడు మరణించారని అధికారులు వెల్లడించారు. వరదలో చిక్కుకున్న ప్రాంతాల్లో నిర్వాసితులకు సహాయ సామాగ్రిని ఈ హెలికాఫ్టర్‌లో తరలిస్తుండగా ప్రమాదం చోటుచేసుకుంది. ఉత్తరకాశీ సమీపంలోని మోల్ది గ్రామం వద్ద ప్రమాదం జరిగింది. హెలికాఫ్టర్‌కు వైర్‌ తగలడంతో చాపర్‌ కూలిందని అరాకోట్‌ నుంచి ఆరు కిలోమీటర్ల దూరంలో ఈ ఘటన జరిగిందని ప్రత్యక్ష సాక్షులు చెబుతున్నారు. భారీ వరద ముంచెత్తడంతో మిగతా ప్రపంచానికి ఈ ప్రాంతంతో సంబంధాలు తెగిపోయాయి. కాగా హెలికాఫ్టర్‌ ప్రమాదంలో మరణించిన వారి కుటుంబ సభ్యులకు ఉత్తరాఖండ్‌ సీఎం త్రివేంద్ర సింగ్‌ రావత్‌ రూ 15 లక్షల చొప్పున పరిహారాన్ని ప్రకటించారు.

Read latest National News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top