కోల్కతాలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు సంభవించింది.
కోల్కతా: కోల్కతాలోని జాతీయ దర్యాప్తు సంస్థ (ఎన్ఐఏ) కార్యాలయం సమీపంలో బాంబు పేలుడు సంభవించింది. సోమవారం రాత్రి దుండగులు ఈ దుశ్చర్యకు పాల్పడ్డారు. బుర్ద్వాన్ పేలుళ్ల నిందితుడు అంజాద్ను ఎన్ఐఏ అధికారులు విచారిస్తున్న సమయంలోనే ఈ ఘటన జరిగింది. పేలుడుకు సీఆర్పీఎఫ్ క్యాంపస్ గోడ పాక్షికంగా దెబ్బతింది.
బుర్ద్వాన్ బాంబు పేలుళ్లకు సంబంధించి పశ్చిమబెంగాల్ పోలీసులు, ఎన్ఐఏ అధికారులు జమత్-ఉల్-ముజాహిద్దీన్ బంగ్లాదేశ్ (జేఎమ్బీ)కి చెందిన ఇద్దరు టాప్ కమాండర్లను అరెస్ట్ చేశారు. శనివారం సాజిద్ అనే ఉగ్రవాద నాయకుడిని, సోమవారం అంజాద్ షేక్ను అదుపులోకి తీసుకున్నారు. వీరిని విచారిస్తున్న సమయంలో పేలుడు జరిగింది.