వెంకయ్యకు ఏపీ బీజేపీ నేతలు కృతజ్ఞతలు | andhra pradesh bjp leaders met venkaiah naidu | Sakshi
Sakshi News home page

వెంకయ్యకు ఏపీ బీజేపీ నేతలు కృతజ్ఞతలు

Sep 9 2016 10:52 AM | Updated on Mar 29 2019 9:12 PM

కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో ఏపీ బీజేపీ నేతలు శుక్రవారం భేటీ అయ్యారు.

న్యూఢిల్లీ : కేంద్రమంత్రి వెంకయ్యనాయుడుతో ఏపీ బీజేపీ నేతలు శుక్రవారం భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఆర్థిక సాయం ప్రకటించినందుకు వెంకయ్యకు కృతజ్ఞతలు తెలిపారు.  ఈ సందర్భంగా వెంకయ్య నాయుడు మాట్లాడుతూ ఏపీకి ఇచ్చిన హామీలన్నీ నెరవేరుస్తామని, పోలవరం ప్రాజెక్ట్ నిర్మాణానికి అడ్డంకులను తొలగించామని అన్నారు.

తమను విమర్శిస్తున్న కాంగ్రెస్ పార్టీ...ప్రత్యేక హోదాపై ఎందుకు చట్టంలో పెట్టలేదన్నారు. కేంద్రం సాయం లేకుండా ఏపీ కోలుకోలేదని వెంకయ్య అన్నారు. కేంద్ర, రాష్ట్రాలు కలిసి పనిచేయాల్సిన అవసరం ఉందని ఆయన అభిప్రాయపడ్డారు. ఇక రైల్వే జోన్ అంశాన్ని రైల్వేశాఖ పరిశీలిస్తోందని ఆయన తెలిపారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement