నూతన సీఈసీగా అచల్‌ కుమార్‌ జోతి | Achal Kumar Jyoti takes over as new chief election commissioner | Sakshi
Sakshi News home page

నూతన సీఈసీగా అచల్‌ కుమార్‌ జోతి

Jun 30 2017 12:19 PM | Updated on Aug 14 2018 4:34 PM

నూతన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అచల్‌ కుమార్‌ జోతి నియమితులయ్యారు.

న్యూఢిల్లీ:  నూతన భారత ప్రధాన ఎన్నికల కమిషనర్‌గా అచల్‌ కుమార్‌ జోతి నియమితులయ్యారు. ఆయన వచ్చే నెల (జూలై) 6న సీఈసీగా బాధ్యతలు స్వీకరించనున్నారు. అచల్‌ కుమార్‌ జోతి గతంలో గుజరాత్ ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి గా పనిచేశారు.  నరేంద్ర మోదీ ఆ రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో అచల్ కుమార్ ప్రభుత్వ సీఎస్‌గా బాధ్యతలు నిర్వహించారు. గుజరాత్‌లో సర్దార్ సరోవర్ నర్మదా నిగమ్ లిమిటెడ్ ఎండీగా, కంద్లా పోర్ట్ ట్రస్టుకు చైర్మన్‌గా, తదితర పదవులు నిర్వహించిన అచల్‌కుమార్ సర్వీసు నుంచి 2013లో రిటైర్ అయ్యారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement