సినీ నిర్మాత గబ్బిట మధుమోహన్‌ కన్నుమూత | Senior Producer Gabbita Madhu Mohan Passed Away Due To Coronavirus | Sakshi
Sakshi News home page

సినీ నిర్మాత గబ్బిట మధుమోహన్‌ కన్నుమూత

Jun 11 2020 12:38 AM | Updated on Jun 11 2020 12:38 AM

Senior Producer Gabbita Madhu Mohan Passed Away Due To Coronavirus - Sakshi

సీనియర్‌ నిర్మాత గబ్బిట మధుమోహన్‌ (55) కరోనాతో మంగళవారం చెన్నైలో కన్నుమూశారు. ఆంధ్రప్రదేశ్‌లోని ఏలూరుకి చెందిన మధుమోహన్‌ 1965 మార్చి 30న జన్మించారు. 1991లో చెన్నైకి వచ్చిన మధుమోహన్‌ అనేక చిత్రాలకు ఎడిటర్‌గా పనిచేశారు. నిర్మాతగా పలు అనువాద చిత్రాలను రూపొందించారు. మూడు రోజుల క్రితం అనారోగ్యానికి గురైన మధుమోహన్‌ కోడంబాకంలోని ప్రైవేట్‌ ఆస్పత్రిలో చేరారు. కరోనా పాజిటివ్‌ అని తేలడంతో చెన్నైలోని రాజీవ్‌గాంధీ ప్రభుత్వాస్పత్రికి తరలించారు. పరిస్థితి విషమించడంతో మంగళవారం ఉదయం కన్నుమూశారు. బుధవారం ఉదయం టీనగర్‌లోని కన్నమ్మపేట శ్మశాన వాటికలో అంత్యక్రియలు నిర్వహించారు. మధుమోహన్‌కు భార్య సుమతి, ముగ్గురు కుమారులు ఉన్నారు. – సాక్షి, చెన్నై

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement