మనిషి జీవితంలో సెల్ఫోన్ తప్పనిసరి అయిపోయింది. ఫోన్లో దాచుకునే విషయాలు పక్కవాళ్లకు కూడా తెలీవు. ఆధునిక పరిజ్ఞానాన్ని
‘‘మనిషి జీవితంలో సెల్ఫోన్ తప్పనిసరి అయిపోయింది. ఫోన్లో దాచుకునే విషయాలు పక్కవాళ్లకు కూడా తెలీవు. ఆధునిక పరిజ్ఞానాన్ని దుర్వినియోగం చేస్తే ఎలాంటి పరిణామాలు ఎదురవుతాయో ఈ సినిమాలో చూపిస్తున్నాం’’ అని రామ్గోపాల్వర్మ అన్నారు. ఆయన దర్శకత్వంలో సచిన్, మీరా చోప్రా జంటగా రూపొందుతోన్న చిత్రం ‘మొగలి పువ్వు’. ఈ సినిమా టీజర్ను హైదరాబాద్లో విడుదల చేశారు. ‘‘ఓ పెళ్లైన వ్యక్తి జీవితంలోకి ఓ అమ్మాయి వచ్చి అతని జీవితంలో ఎలాంటి ప్రకంపననలు సృష్టించిందో, అతని వైవాహిక జీవితం ఎలాంటి కుదుపులకు లోనైందో ఈ సినిమాలో చూపించనున్నాం’’ అని వర్మ చెప్పారు. ఆయన దర్శకత్వంలో చేయడం ఆనందంగా ఉందని సచిన్ జోషి అన్నారు.