
రకుల ప్రీత్ సింగ్ తెలుగులో వరుస అవకాశాలతో స్టార్ హీరోలతో నటించి క్రేజీ హీరోయిన్గా పేరు తెచ్చుకున్నారు. ఆమె స్పైడర్ తర్వాత మళ్లీ తెలుగులో సినిమా చేయలేదు. అయితే రకుల్ కొత్త సంవత్సరంలో కోలీవుడ్ తో పాటు బాలీవుడ్ పై ఫోకస్ పెట్టాలని నిర్ణయించుకున్నట్టు తెలుస్తోంది. ప్రస్తుతం తమిళ్లో సెల్వరాఘవన్ దర్శకత్వం వహించనున్న సినిమాలో సూర్య సరసన రకుల్ని హిరోయిన్గా ప్రకటించారు. ఇప్పటికే కార్తీ సరసన ‘ఖాకీ’ సినిమాలో నటించిన రకుల్ మళ్లీ ఆయనతో జతకట్టనున్నారు. దీంతో అన్నదమ్ముల సినిమాలతో ఈ బ్యూటీ బిజీగా ఉండబోతున్నారు.
రకుల్ త్వరలో బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సరసన నటించడానికి సిద్ధమయ్యారని తెలుస్తోంది. ఇప్పటికే అక్షయ్ కుమార్ తన సరసన నటించడానికి సౌత్ హీరోయిన్లు ఆసిన్, కాజల్ అగర్వాల్, తమన్నా, శృతిహాసన్ లాంటి హీరోయిన్లకు అవకాశమిచ్చారు. ఆమె లీడ్ రోల్ తో తెరకెక్కిన బాలీవుడ్ మూవీ ‘ఆయారి’. సిద్దార్థ్ మల్హోత్రా, మనోజ్ బాజ్పాయ్, నసిరుద్ధీన్ షా లు ప్రధాన పాత్రల్లో తెరకెక్కిన ఈ సినమాకు నీరజ్ పాండే దర్శకుడు. థ్రిల్లర్ జానర్లో తెరకెక్కిన ఈ సినిమా రిపబ్లిక్ డే కానుకగా రిలీజ్ అవుతోంది.