ఎన్‌కౌంటర్‌పై స్పందించిన మోహన్‌బాబు

Mohan Babu Response Over Disha Accused Encounter - Sakshi

దిశ కేసులో నిందితులను పోలీసులు ఎన్‌కౌంటర్‌ చేయడంపై దేశంలోని ప్రజలంతా హర్షం వ్యక్తం చేస్తున్నారు. తెలంగాణ పోలీసులకు అభినందనలు తెలుపుతున్నారు. తాజాగా ఈ ఘటనపై ప్రముఖ నటుడు మెహన్‌బాబు స్పందించారు. ఈ పనిని భగవంతుడే చేయించినట్టు తాను భావిస్తున్నానని తెలిపారు. నిందితులను ఎన్‌కౌంటర్‌ చేసిన పోలీసులని అభినందిస్తున్నాని చెప్పారు. దీనిని దిశకు నివాళిగా భావిస్తున్నానని అన్నారు. 

‘చట్టం, న్యాయం భారతీయులకు రెండు కళ్లు. ధర్మం మూడో కన్ను. లేకపోతే దిశపై అత్యాచారం, హత్య జరిగిన రోజే నాతో పాటు ఎందరో వెళ్లి ఆ నరరూప రాక్షసులను ముక్కలు ముక్కలుగా నరికేవారు. పోలీసులు చట్టప్రకారం తమ పని తాము చేసుకుంటూ వెళ్తుంటే నిందితులు వారి కన్ను కప్పి పారిపోవడం వేరు.. కానీ పోలీసుల చేతిలోని ఆయుధాలను గుంజుకుని వారినే చంపాలని చూస్తే.. వారి దగ్గరున్న ఆప్షన్‌ ఎన్‌కౌంటర్‌ మాత్రమే. ఇది కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి దాకా ఆత్మవేదనలో ఉన్న భారతీయుల కోసం భగవంతుడే చేయించాడని భావిస్తున్నాను. తెలంగాణ పోలీసులను అభినందిస్తున్నాను. ఇది దిశకు నివాళిగా భావిస్తున్నా’ని మోహన్‌బాబు ట్విటర్‌లో పేర్కొన్నారు.

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top