
అమితాబ్ బచ్చన్
ఆదివారం వస్తోందంటే చాలు అమితాబ్ బచ్చన్ అభిమానులకు జల్సానే జల్సా. ఎందుకంటే ఆయన ముంబైలో ఉంటే కచ్చితంగా తన అభిమానులను కలుస్తారు. ‘జల్సాకి రండి.. జాలీగా కబుర్లు చెప్పుకుందాం’ అని అభిమానులను ఆహ్వానిస్తారు. ఈసారి ‘నో జల్సా’ అంటూ ఫ్యాన్స్ని నిరుత్సాహపరిచారు. అయితే వారి క్షేమం కోసమే. కరోనా వ్యాప్తి కారణంగా స్కూళ్లు, సినిమా హాళ్లు, షాపింగ్ మాల్స్ బంద్ అయ్యాయి. ఎక్కువగా జనాలు గుమిగూడటం మంచిది కాదనే పరిస్థితి. అందుకే ఫ్యాన్స్తో మీటింగ్ని అమితాబ్ క్యాన్సిల్ చేశారు. ‘‘నా అభిమానులకు, శ్రేయోభిలాషులందరికీ ఓ విన్నపం. దయచేసి జల్సా (అమితాబ్ ఇంటి పేరు జల్సా) గేట్ దగ్గరకు రావొద్దు. ఆదివారం మీటింగ్కి నేను రాను. అందరూ జాగ్రత్తలు తీసుకోండి. సేఫ్గా ఉండండి’’ అని అమితాబ్ సోషల్ మీడియా ద్వారా పేర్కొన్నారు.