ఖాన్ త్రయం కంటే బిగ్ బినే మేటి | Sakshi
Sakshi News home page

ఖాన్ త్రయం కంటే బిగ్ బినే మేటి

Published Mon, Sep 1 2014 6:24 PM

ఖాన్ త్రయం కంటే బిగ్ బినే మేటి - Sakshi

ముంబై: బాలీవుడ్ బిగ్ బి అమితాబ్ బచ్చన్కు కోట్లాది అభిమానులున్నారు. సోషల్ మీడియాలోనూ తిరుగులేని సంఖ్యలో అభిమానులున్నారు. ట్విట్టర్లో అమితాబ్ ఫ్యాన్ ఫాలోయింగ్ సంఖ్య కోటిదాటింది. అమితాబ్ ఈ విషయంలో తన తర్వాతి తరం బాలీవుడ్ నటులు షారుక్ ఖాన్ (87 లక్షలు), అమీర్ ఖాన్ (81 లక్షలు), సల్మాన్ (79 లక్షలు), ప్రియాంక చోప్రా (68  లక్షలు) కంటే ఎప్పుడో అధిగమించారు.


2010 మేలో ట్విట్టర్లో ఖాతా తెరిచిన అమితాబ్ సోషల్ మీడియాలో యాక్టివ్గా ఉంటారు. తరచూ ట్వీట్లు చేస్తూ అభిమానులతో ముచ్చటిస్తుంటారు. ట్విట్టర్లో రెండు కోట్ల ఫాలోయిర్ల సంఖ్యను దాటడమే తన తదుపరి లక్ష్యమని ట్వీట్ చేశారు.

Advertisement
Advertisement