రక్తం తీశారు.. ‘గిన్నిస్’కెక్కారు | 'Guinness' record for blood test | Sakshi
Sakshi News home page

రక్తం తీశారు.. ‘గిన్నిస్’కెక్కారు

May 27 2014 12:25 AM | Updated on Apr 3 2019 4:24 PM

రక్తం తీశారు..  ‘గిన్నిస్’కెక్కారు - Sakshi

రక్తం తీశారు.. ‘గిన్నిస్’కెక్కారు

అదో పెద్ద షాపింగ్ మాల్.. వచ్చిన వాళ్లను వచ్చినట్లుగా క్యూలో నిలబెట్టారు.. వరుసబెట్టి వారి రక్తం తీసుకుని పరీక్షలు చేశారు.. గిన్నిస్ రికార్డు కొట్టేశారు

దుబాయ్: అదో పెద్ద షాపింగ్ మాల్.. వచ్చిన వాళ్లను వచ్చినట్లుగా క్యూలో నిలబెట్టారు.. వరుసబెట్టి వారి రక్తం తీసుకుని పరీక్షలు చేశారు.. గిన్నిస్ రికార్డు కొట్టేశారు.. అసలు జరిగిందేమిటో తెలుసా? దుబాయ్‌లో మధుమేహం విజృంభిస్తుండడంతో... జనంలో చైతన్యం కల్పించేందుకు అక్కడి ప్రభుత్వం ఓ కార్యక్రమం చేపట్టింది. ఇందుకోసం ఎప్పుడూ జనంతో కిక్కిరిసిపోయే దుబాయ్ షాపింగ్ మాల్‌ను ఎన్నుకొంది.

80 మంది నర్సులను ఏర్పాటు చేసి.. మాల్‌కు వచ్చినవారికి వచ్చినట్లుగా మధుమేహం పరీక్షలు చేసింది. మొత్తంగా 80 మంది నర్సులు ఎనిమిది గంటల్లో 8,675 మందికి ఈ పరీక్షలు చేశారు. ఒకేచోట తక్కువ సమయంలో ఎక్కువ రక్తపరీక్షలు చేసిన రికార్డుతో గిన్నిస్‌బుక్‌లోకి ఎక్కేశారు. అయితే.. పరీక్ష చేయించుకున్నవారిలో ఎంత మందికి మధుమేహం ఉందనేది మాత్రం వెల్లడించలేదు మరి.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement