ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి మండిపడ్డారు.
హైదరాబాద్: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు కార్మికుల హక్కులను కాలరాస్తున్నారని వైఎస్ఆర్ టీయూసీ రాష్ట్ర అధ్యక్షుడు గౌతంరెడ్డి మండిపడ్డారు. కార్మిక చట్టాలను తుంగలో తొక్కారని విమర్శించారు. విశాఖపట్నం జిల్లాలోని బ్రాండిక్స్లో మానవ హక్కుల ఉల్లంఘన జరుగుతోందని ఆరోపించారు. కార్మికులకు వైఎస్ఆర్ సీపీ అండగా ఉంటుందని చెప్పారు.