కేసీఆర్ పాప పరిహారానికే యాగం: మందకృష్ణ | Manda krishna fires on KCR | Sakshi
Sakshi News home page

కేసీఆర్ పాప పరిహారానికే యాగం: మందకృష్ణ

Dec 19 2015 4:41 AM | Updated on Aug 14 2018 10:54 AM

కేసీఆర్ పాప పరిహారానికే యాగం: మందకృష్ణ - Sakshi

కేసీఆర్ పాప పరిహారానికే యాగం: మందకృష్ణ

ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాప పరిహారం కోసమే యాగం చేస్తున్నారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు.

సాక్షి, హైదరాబాద్: ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు పాప పరిహారం కోసమే యాగం చేస్తున్నారని మందకృష్ణ మాదిగ ఆరోపించారు. ఎస్సీ వర్గీకరణ విషయంలో ఆయన చేసిన మోసం, పాపం కడుక్కునేందుకే ఈ యాగాలు అని మండిపడ్డారు. శుక్రవారం సచివాలయంలో ఆయన మాట్లాడుతూ.. ఎస్సీ వర్గీకరణ విషయంలో సీఎంకు చిత్తశుద్ధి లేదని, ప్రభుత్వం దిగిరాకపోతే పెద్ద ఎత్తున ఉద్యమం చేస్తామని హెచ్చరించారు. శనివారం మధ్యాహ్నం ఇందిరాపార్కు వద్ద అన్ని పార్టీల అధ్యక్షులతో మహాధర్నా చేపడతామని పేర్కొన్నారు. అయుత చండీయాగంలో ఒక్క దళితుడు కూడా లేనపుడు యాగం ఫలితం ప్రజలందరికీ ఎలా చెందుతుందని ప్రశ్నించారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement