విషం తాగి ప్రేమజంట ఆత్మహత్య | Lovers commit suicide | Sakshi
Sakshi News home page

విషం తాగి ప్రేమజంట ఆత్మహత్య

Jun 6 2016 8:13 PM | Updated on Nov 6 2018 7:56 PM

తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భయపడిన ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కూకట్‌పల్లికి చెందిన రేష్మ అనే పదో తరగతి చదివే బాలిక వేసవి సెలవుల్లో గుంటూరు జిల్లా కొల్లూరులోని అమ్మమ్మ గారింటికి వెళ్లింది.

హైదరాబాద్ : తమ పెళ్లికి పెద్దలు ఒప్పుకోరని భయపడిన ఓ ప్రేమ జంట బలవన్మరణానికి పాల్పడింది. ఆలస్యంగా వెలుగులోకి వచ్చిన ఈ ఘటన వివరాల్లోకి వెళ్తే.. కూకట్‌పల్లికి చెందిన రేష్మ అనే పదో తరగతి చదివే బాలిక వేసవి సెలవుల్లో గుంటూరు జిల్లా కొల్లూరులోని అమ్మమ్మ గారింటికి వెళ్లింది. ఆమెకు అక్కడ రవి అనే యువకుడితో ఏర్పడిన పరిచయం ప్రేమగా మారింది. ఇంట్లో పెద్దలకు చెప్పకుండా ఇద్దరూ గత నెల 30వ తేదీన భద్రాచలం వెళ్లిపోయి, అక్కడ పెళ్లి చేసుకున్నారు.

బాలిక తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు పోలీసులు దర్యాప్తు చేపట్టారు. సెల్‌ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా భద్రాచలం వెళ్లి వారి కోసం గాలించారు. అయితే తమ పెళ్లి విషయం తెలిస్తే పెద్దలు ఏమంటారోననే భయంతో వారు విషం తాగారు. పోలీసులు వెళ్లేసరికి స్థానిక ప్రైవేట్ లాడ్జిలో ఇద్దరూ అపస్మారక స్థితిలో పడి ఉన్నారు. దీంతో పోలీసులు ఇద్దరినీ వెంటనే స్థానిక ఆస్పత్రికి తరలించారు. చికిత్స పొందుతూ రవి ఈ నెల 4వ తేదీన, రేష్మ 5వ తేదీన మృతిచెందారు. ఈ మేరకు పోలీసులు కేసు దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement