- చాక్లెట్లలో గంజాయి కలిపి విక్రయిస్తున్న న్యూరాలజిస్టు
- అరెస్టు చేసిన పహాడీషరీఫ్ పోలీసులు
హైదరాబాద్: ఎంబీబీఎస్ చదివి రోగులకు సేవలందించాల్సిన వైద్యుడు... అడ్డదారిలో సంపాదనకు అలవాటుపడి యువతను మత్తుమందులకు బానిస చేస్తున్నాడు. చాక్లెట్లలో గంజాయి కలిపి సామాజిక మాధ్యమం ద్వారా తన చీకటి వ్యాపారాన్ని ఇతర రాష్ట్రాలకూ విస్తరించాడు. విషయం తెలుసుకున్న ఎస్ఓటీ పోలీసులు ఆ వైద్యుడిని అరెస్టు చేసి కటకటాల వెనక్కి నెట్టారు. రాజధానిలోని పహాడీషరీఫ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.
యూట్యూబ్లో చూసి...
బహదూర్పురాకు చెందిన మహ్మద్ సుజాత్ అలీఖాన్ (35) 2006లో దక్కన్ మెడికల్ కాలేజీలో ఎంబీబీఎస్ పూర్తి చేశాడు. అప్పటి నుంచి 2014 వరకు నిమ్స్లో రీసెర్చ్ కోఆర్డినేటర్గా పనిచేశాడు. అనంతరం అక్కడ ఉద్యోగం మానేసిన జిమ్లో ఫిట్నెస్ కన్సల్టెంట్గా చేరి.. ఆహారపు అలవాట్లపై సలహాలివ్వడం ప్రారంభించాడు. సరైన సంపాదన లేకపోవడంతో కుటుంబ పోషణ భారమై ఆర్థిక ఇబ్బందులతో సతమతమయ్యాడు. దీంతో చాక్లెట్లలో గంజాయి కలిపి విక్రయించాలని నిర్ణయించుకుని, యూట్యూబ్లో దీని తయారీని నేర్చుకున్నాడు.
న్యూరాలజిస్టు అయిన సుజాత్కు... ఏ మోతాదులో కలిపితే ఎంత ప్రభావం చూపుతుందో తెలుసుకోవడం సులభమయ్యింది. వివిధ మార్గాల ద్వారా వెంటనే గంజాయి తెప్పించుకొని దానిని పొడిగా చేసి... చాక్లెట్ మిశ్రమంలో కలపడం ప్రారంభించారు. అలా తయారు చేసిన చాక్లెట్లను విక్రయించడానికి ఇన్స్ట్రాగామ్ యాప్లో ఓ గ్రూప్ ఏర్పాటు చేశాడు. ఈ చాక్లెట్లో కలిపిన గంజాయి పనితీరును వారికి వివరించాడు. వీటిని ఎక్స్, 2ఎక్స్, 3ఎక్స్ బ్రాండ్లుగా పేర్కొంటూ ఒక్కోటి రూ.500 నుంచి రూ.1,800 వరకు అమ్మాడు. ఇతర రాష్ట్రాల వారికి కూడా సరఫరా చేస్తూ సులభంగా డబ్బు సంపాదించగలిగాడు.
వలవేసి పట్టిన పోలీసులు
ఈ దందాపై సమాచారం అందుకున్న మల్కాజ్గిరి ఎస్ఓటీ ఇన్స్పెక్టర్లు నర్సింగ్రావు, నవీన్కుమార్, పహాడీషరీఫ్ ఇన్స్పెక్టర్ లక్ష్మీకాంతరెడ్డి... షాహినగర్లోని ఓ కస్టమర్కు గంజాయి చాక్లెట్లు విక్రయిస్తుండగా వైద్యుడిని అరెస్టు చేశారు. అతని వద్ద నుంచి బైక్తో పాటు రూ.12,520 నగదు, 45 గంజాయి చాక్లెట్లు, చాక్లెట్లు తయారీ సామగ్రిని స్వాధీనం చేసుకున్నారు. కల్తీ చాక్లెట్ల కోసం చాక్లెట్ కేక్, కోకో పౌడర్, నెయ్యి, నూనె, ప్లాస్టిక్ కప్, లేబుల్స్ వంటి ముడి సామగ్రి సుజాత్ కొనుగోలు చేస్తున్నట్టు పోలీసులు గుర్తించారు. ఈ చాక్లెట్లను తిన్నవారు దాదాపు 8 గంటల పాటు మత్తులో జోగుతూ.. అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. మెదడుపై దీని ప్రభావం అధికంగా ఉంటుంది. ఇవి కొనుగోలు చేస్తున్న వారిలో ఎక్కువమంది యువతే ఉన్నట్టు పోలీసులు భావిస్తున్నారు.
డాక్టర్ @ గంజాయి చాక్లెట్!
Published Sun, Jan 29 2017 2:57 AM
Advertisement
ఓటర్ మిత్రమా.. జాగ్రత్త! ఆ సౌండ్ వస్తేనే మీరు ఓటేసినట్టు!
ఇది కదా క్రేజ్ అంటే.. సీఎం జగన్ ఇంటర్వ్యూకి మిలియన్ల వ్యూస్
Sakshi.com ఇప్పుడు సరికొత్తగా మీ ముందుకు
కాపులు, ముస్లింలకు రిజర్వేషన్లు అక్కర్లేదు: పవన్కళ్యాణ్
రైతు కుమార్తె విజయం.. రిషబ్ శెట్టి అభినందనలు
పులివెందుల ప్రజలకు ఇద్దరిపైనా ప్రేమే: వైఎస్ భారతి
RCB Vs PBKS: కోహ్లి అరుదైన రికార్డు.. ఐపీఎల్ చరిత్రలోనే తొలి క్రికెటర్గా
Phone Tapping Case: ఫోన్ ట్యాపింగ్ కేసులో బిగ్ ట్విస్ట్..
బిజీగా ఉండటం ఇంత డేంజరా! హెచ్చరిస్తున్న సైకాలజిస్ట్లు
కారులో వాసన బాగుందని తెగ పీల్చుకుంటున్నారా.?
●ఓటు వేసిన 9,545 మంది..
● ఏర్పాట్లు పూర్తి చేసిన అధికారులు ● ఉదయం 7 నుంచి సాయంత్రం 6 గంటల వరకు పోలింగ్ ● కొత్తగూడెం, అశ్వారావుపేట నియోజకవర్గాల్లో 4 గంటలకే ముగింపు ● మొత్తం ఓటర్లు 16,31,039 మంది ● ఏడు నియోజకవర్గాల్లో 1,896 పోలింగ్ కేంద్రాలు
ప్రయాణం.. ప్రహసనమే..
బీజేపీ నేతలు తరలిస్తున్న నగదు పట్టివేత
ఎండను జయించండి..
సింగరేణి కార్మికుల ఓటు ఎటువైపు?
మే 30న సంతాప దినంగా పాటించండి
అదుపు తప్పిన ఆర్టీసీ బస్సు
‘అకాల’ నష్టం
ఎన్నికలు ప్రశాంతంగా సాగేలా..
తప్పక చదవండి
- Lok Sabha Election 2024: ఐదో విడతలోనూ మహిళలు అంతంతే
- Lok Sabha Election 2024: మాజీ మామా అల్లుళ్ల సవాల్
- Lok Sabha Election 2024: మోదీకి ఆయన స్టైల్లోనే బదులిస్తా
- Lok Sabha Election 2024: రా రమ్మని.. రారా రమ్మని
- Lok Sabha Election 2024: ఈసారి యూట్యూబ్ హవా!
- టీడీపీలో భయాందోళనలు
- పోటెత్తిన ఓటర్లు
- తొమ్మిది సీట్లు పక్కా.. ఒకటి ఎక్స్ట్రా!
- మాచర్లలో ఉద్రిక్తత.. పిన్నెల్లిపై టీడీపీ శ్రేణుల మూక దాడి
- బీజేపీ అభ్యర్థి మాధవీ లతపై కేసు నమోదు
Advertisement