సాక్షి జర్నలిజం పరీక్షకు సర్వం సిద్ధం | all set ready for sakshi Journalismentrance exam | Sakshi
Sakshi News home page

సాక్షి జర్నలిజం పరీక్షకు సర్వం సిద్ధం

Feb 27 2016 3:14 AM | Updated on Sep 5 2018 8:36 PM

తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ నెల 28న సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం నిర్వహించనున్న ప్రవేశపరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపల్ దిలీప్‌రెడ్డి తెలిపారు.

సాక్షి, హైదరాబాద్: తెలంగాణ, ఆంధ్రప్రదేశ్‌లలో ఈ నెల 28న సాక్షి స్కూల్ ఆఫ్ జర్నలిజం నిర్వహించనున్న ప్రవేశపరీక్షకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ప్రిన్సిపల్ దిలీప్‌రెడ్డి తెలిపారు. దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు www.sakshischoolofjournalism.com లేదా www.sakshi.comవెబ్‌సైట్‌లలో హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవాలని సూచించారు. సాంకేతిక కారణాల వల్ల హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ కాకపోతే అప్లికేషన్ వివరాలు, రెండు పాస్‌పోర్టు సైజ్ ఫొటోలతో ఆయా జిల్లాల పరీక్ష కేంద్రాలకు 28 ఉదయం 9 గంటల లోపు చేరుకుని నిర్వాహకులను సంప్రదించాలని పేర్కొన్నారు. అన్ని వివరాలు సంతృప్తికరంగా ఉన్న అభ్యర్థులు నిర్వాహకుల అనుమతి మేరకు పరీక్షకు హాజరుకావచ్చని చెప్పారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement