తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీయే | we are developing the telengana tdp | Sakshi
Sakshi News home page

తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీయే

Apr 14 2014 3:54 AM | Updated on Aug 15 2018 9:06 PM

తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీయే - Sakshi

తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీయే

కేంద్రంలో ఎన్‌డీయే, ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు.

హైదరాబాద్ : కేంద్రంలో ఎన్‌డీయే, ఆంధ్ర,తెలంగాణ రాష్ట్రాల్లో టీడీపీ విజయం సాధిస్తుందని తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణను అభివృద్ధి చేసింది టీడీపీయేనన్నారు. చేవెళ్ళ పార్లమెంట్ అభ్యర్థి టి.వీరేందర్‌గౌడ్, మహేశ్వరం అసెంబ్లీ అభ్యర్థి తీగల కృష్ణారెడ్డికి మద్దతుగా ఆదివారం రాత్రి మంద మల్లమ్మ చౌరస్తా నుంచి ఆయన రోడ్ షో నిర్వహించారు. అనంతరం జరిగిన బహిరంగ సభలో మాట్లాడారు. రంగారెడ్డి జిల్లా పేదలు, బడుగులు ఉండే జిల్లా అని, ముందు చూపుతోనే ఈ ప్రాంతాన్ని దత్తత తీసుకుని అభివృద్ధి చేశానన్నారు. హైదరాబాద్ చుట్టూ  ఔటర్ రింగ్ రోడ్‌ను ఏర్పాటు చేసింది,కృష్ణానీళ్లను తీసుకొచ్చిందిటీడీపీయేనన్నారు.

‘నేను ఎక్కడికీ వెళ్ళను, ఇక్కడే ఉంటా.. నాయకులను తయారు చేస్తా.. తెలంగాణను దేశంలోనే బ్రహ్మాండమైన రాష్ట్రం గా తీర్చిదిద్దుతా’నని చంద్రబాబు పేర్కొన్నారు. దోచుకున్న సొమ్మంతా ఫామ్‌హౌస్‌లో దాచి ప్రజల చెవుల్లో కేసీఆర్ క్యాప్సి కం పెడుతున్నాడని ఆరోపించారు. కేసీఆర్ వ్యక్తిత్వం లేని వ్యక్తి అని ఆరోపిస్తూ, టీడీపీకి అడ్డం వస్తే తొక్కుకుంటూ వెళతామని హెచ్చరించారు. పదేళ్ల కాంగ్రెస్ పాలనలో దేశం, రాష్ట్రం భ్రష్టుపట్టాయన్నారు. ప్రధాన మంత్రి మన్మోహన్ ఓ కీలుబొమ్మ  విమర్శించారు. బీజేపీతో టీడీపీ పొత్తు చారిత్రక అవసరమన్నారు. ఢిల్లీలో మోడీకి, ఇక్కడ టీడీపీకి తిరుగులేదని అన్నారు.
 
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement