నేడు నాలుగో దశ పోలింగ్ | Fourth phase of Lok Sabha in 4 states tomorrow | Sakshi
Sakshi News home page

నేడు నాలుగో దశ పోలింగ్

Apr 12 2014 1:39 AM | Updated on Aug 29 2018 8:54 PM

నేడు నాలుగో దశ పోలింగ్ - Sakshi

నేడు నాలుగో దశ పోలింగ్

నాలుగు రాష్ట్రాల్లోని ఏడు లోక్‌సభ స్థానాలకు శనివారం సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్ జరగనుంది. అస్సాంలోని మూడు స్థానాలు, గోవాలోని మొత్తం రెండు స్థానాలు, త్రిపుర, సిక్కింలలో ఒక్కో స్థానంతోపాటు సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి.

4 రాష్ట్రాల్లో 7 స్థానాలకు ఓటింగ్
న్యూఢిల్లీ: నాలుగు రాష్ట్రాల్లోని ఏడు లోక్‌సభ స్థానాలకు శనివారం సార్వత్రిక ఎన్నికల నాలుగో దశ పోలింగ్ జరగనుంది. అస్సాంలోని మూడు స్థానాలు, గోవాలోని మొత్తం రెండు స్థానాలు, త్రిపుర, సిక్కింలలో ఒక్కో స్థానంతోపాటు సిక్కింలోని 32 అసెంబ్లీ స్థానాలకు ఈ ఎన్నికలు జరగనున్నాయి. మొత్తం 74 మంది అభ్యర్థుల భవితవ్యాన్ని సుమారు 50 లక్షల మంది ఓటర్లు నిర్దేశించనున్నారు.
 
 మిజోరంలో 60 శాతం పోలింగ్
 మిజోరంలోని ఏకైక లోక్‌సభ స్థానానికి శుక్రవారం జరిగిన ఎన్నికల్లో 60 శాతం పోలింగ్ నమోదైంది. పోలింగ్ శాతం పెరిగే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. సాంకేతిక కారణాల వల్ల మూడు ఈవీఎంలను, 10 ఓటరు ధ్రువీకృత కాగితపు రశీదు యంత్రాలను మార్చినట్లు చెప్పారు. 2009 లోక్‌సభ ఎన్నికల్లో ఇక్కడ 50.93 శాతం ఓటింగ్ రికార్డయింది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement