శ్రీశైల జలాశయ నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. గత రెండు రోజులుగా కురిసిన తేలికపాటి వర్షాలతో ఒక పాయింట్ నీటిమట్టం పెరిగింది.
శ్రీశైలంలో స్వల్పంగా పెరిగిన నీటిమట్టం
Apr 29 2017 12:35 AM | Updated on Sep 27 2018 5:46 PM
శ్రీశైలం ప్రాజెక్టు: శ్రీశైల జలాశయ నీటిమట్టం స్వల్పంగా పెరిగింది. గత రెండు రోజులుగా కురిసిన తేలికపాటి వర్షాలతో ఒక పాయింట్ నీటిమట్టం పెరిగింది. 22.3120 టీఎంసీలుగా ఉన్న నీరు 22.3458 టీఎంసీలకు చేరుకుంది. 785 అడుగులుగా ఉన్న జలాశయ నీటిమట్టం శుక్రÐవారం సాయంత్రం సమయానికి 785.10 అడుగులకు చేరుకుంది. పగటి పూట ఉష్ణోగ్రతలు గరిష్టంగా 40 డిగ్రీలకు చేరుకుంది. జలాశయంలో 130 క్యూసెక్కుల నీరు ఆవిరి అయింది.
Advertisement
Advertisement