శ్రీశైలం జలాశయ నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. గత 7 వ తేదీ వరకు 775. 50 గా ఉన్న నీటిమట్టం మంగళవారం సాయంత్రం సమయానికి 777.60 అడుగులకు చేరుకుంది.
స్వల్పంగా పెరుగుతున్న శ్రీశైలం డ్యాం నీటిమట్టం
Jun 13 2017 10:51 PM | Updated on Sep 5 2017 1:31 PM
శ్రీశైలం ప్రాజెక్ట్: శ్రీశైలం జలాశయ నీటి మట్టం స్వల్పంగా పెరుగుతోంది. గత 7 వ తేదీ వరకు 775. 50 గా ఉన్న నీటిమట్టం మంగళవారం సాయంత్రం సమయానికి 777.60 అడుగులకు చేరుకుంది. సెల్ఫ్ క్యాచ్మెంట్ ఏరియాల్లో కురుస్తున్న తేలికపాటి వర్షాలతో జలాÔ¶శయంలోకి నీరు వచ్చి చేరుతోంది. పగటిపూట ఉష్ణోగ్రతలు గరిష్టంగా 30 డిగ్రీలు ఉండటంతో 75 క్యూసెక్కులనీరు ఆవిరి అయునట్లు గేజింగ్సిబ్బంది తెలిపారు.
Advertisement
Advertisement