సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి | take mesure to save crops | Sakshi
Sakshi News home page

సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవాలి

Aug 27 2016 12:08 AM | Updated on Jun 4 2019 5:04 PM

రైతులు పత్తి పంట సాగులో వ్యవసాయ అధికారుల సలహాల ప్రకారం సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీఏ పుల్లయ్య అన్నారు. శుక్రవారం ఆయన ఏవో వివేక్‌తో కలిసి గూడ గ్రామంలో పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తిలో ఈ సంవత్సరం కొత్తం గులాబి రంగు పురుగు ఉధతి ఎక్కువగా కనిపిస్తోందన్నారు.

జైనథ్‌ : రైతులు పత్తి పంట సాగులో వ్యవసాయ అధికారుల సలహాల ప్రకారం సమగ్ర సస్యరక్షణ చర్యలు తీసుకోవాలని వ్యవసాయ శాఖ ఏడీఏ పుల్లయ్య అన్నారు. శుక్రవారం ఆయన ఏవో వివేక్‌తో కలిసి గూడ గ్రామంలో పత్తి పంటలను పరిశీలించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. పత్తిలో ఈ సంవత్సరం కొత్తం గులాబి రంగు పురుగు ఉధతి ఎక్కువగా కనిపిస్తోందన్నారు.
       వాస్తవానికి బీటీ–2 పత్తి విత్తనంలో ఉన్న విషం వలన ఈ పురుగు పంటలను ఆశించడం జరగదని పేర్కొన్నారు. కాకపోతే రైతులు పంటల సాగులో సరైన సస్యరక్షణ చర్యలు తీసుకోకపోవడం వలన బీటీలోని విషాన్ని సైతం ఈ పురుగులు తట్టుకోగలుగుతున్నాయి. పంటను నాశనం చేస్తోందని వివరించారు. అయితే బీటీ పత్తి వేసేటప్పుడు చుట్టు 5 వరసల్లో నాన్‌ బీటీ వేసుకోవడం, వేసవి కాలంలో లోతుగా దుక్కులు దున్నుకోవడం, మితిమీరిన పురుగుల మందులు వాడకపోవడం వలన ఈ పురుగు ఉధృతిని అరికట్టవచ్చన్నారు.
           అయితే ఈ పురుగు ఉధృతిని తెలుసుకునేందుకు రైతులు తమ చేళలో లింగాకర్షక బుట్టలను ఏర్పాటు చేయాలన్నారు. ప్రాథమిక దశలో ఈ పురుగును గుర్తిస్తే, లీటరు నీటికి 5 మి.లీ  వేప నూనెను కలిపి పిచికారీ చేసుకోవాలన్నారు. ఉధృతి ఎక్కువగా కనిపిస్తే, 200లీటర్ల నీటిలో 400 మి.లీ ప్రొఫెనోపాస్‌ లేదా క్వినాల్‌ఫాస్‌ అనే మందులను కలిపి ఎకరం విస్తీర్ణంలో పిచికారీ చేసుకోవాలన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement