
ఈసారి తాడో పేడో తేల్చుకుంటాం
పాలెం బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని, ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 8 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు.
రాష్ట్ర అధ్యక్షుడు రమణయ్య మాదిగ మాట్లాడుతూ ఎస్సీ వర్గీకరణకు పార్లమెంటులో చట్టబద్దత కల్పించాలని డిమాండు చేశారు. వర్గీకరణకు అసెంబ్లీలో ఏకగ్రీవ తీర్మానం చేసి అఖిల పక్షాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీకి తీసుకుని వెళ్లాలన్నారు. సూదాపాలెం బాధితులకు రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగాలు కల్పించాలని, ఒక్కో బాధిత కుటుంబానికి రూ. 8 లక్షల చొప్పున పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర వర్కింగ్ ప్రెసిడెంట్ ఎం.ఎస్.రాజు, సభకు అధ్యక్షత వహించిన రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఇజ్రాయిల్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు ‘ మీకు వర్గీకరణ చేసి నేను పెద మాదిగ అవుతాన’ని... డప్పు కొట్టి మరీ చెప్పిన చంద్రబాబు ఇప్పుడు మాదిగలను దగా చేసి మాట తప్పారని ధ్వజమెత్తారు. ఎమ్మార్పీఎస్ రాష్ట్ర ఉద్యోగుల సంఘం అధ్యక్షుడు గొర్రె లాజరస్, ఎమ్మార్పీఎస్ రాష్ట్ర నాయకులు ఉందుర్తి, సుబ్బారావు, ఉప్పలపాటి నెపోలియన్ తదితరులు ప్రసంగించారు.