భారీగా రేషన్ బియ్యం పట్టివేత | Sakshi
Sakshi News home page

భారీగా రేషన్ బియ్యం పట్టివేత

Published Sun, Aug 9 2015 9:37 AM

Ration rice seized in prakasam district

ఒంగోలు : అక్రమంగా తరలిస్తున్న 250 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ... సీజ్ చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం ఇడపలపాడు గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులకు ఆగంతకులు ఫోన్ చేసి సమాచారం అందించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బియ్యం తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బియ్యాన్ని స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement
Advertisement