భారీగా రేషన్ బియ్యం పట్టివేత | Ration rice seized in prakasam district | Sakshi
Sakshi News home page

భారీగా రేషన్ బియ్యం పట్టివేత

Aug 9 2015 9:37 AM | Updated on Sep 3 2017 7:07 AM

అక్రమంగా తరలిస్తున్న 250 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ... సీజ్ చేశారు.

ఒంగోలు : అక్రమంగా తరలిస్తున్న 250 బస్తాల రేషన్ బియ్యాన్ని పోలీసులు స్వాధీనం చేసుకుని ... సీజ్ చేశారు. ఈ సంఘటన ప్రకాశం జిల్లా ఇంకొల్లు మండలం ఇడపలపాడు గ్రామంలో శనివారం అర్ధరాత్రి చోటు చేసుకుంది. రేషన్ బియ్యం అక్రమంగా తరలిస్తున్నారని పోలీసులకు ఆగంతకులు ఫోన్ చేసి సమాచారం అందించారు.

దీంతో రంగంలోకి దిగిన పోలీసులు తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా బియ్యం తరలిస్తున్న వాహనాన్ని అదుపులోకి తీసుకున్నారు. అనంతరం బియ్యాన్ని స్వాధీనం చేసుకుని రెవెన్యూ అధికారులకు అప్పగించారు. దీనిపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement