స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలోని సూదేపల్లె స్టేజ్ వద్ద ఎన్హెచ్–44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతిచెందగా ఇద్దరు గాయపడ్డారు.
రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతి
Dec 5 2016 12:12 AM | Updated on Sep 4 2017 9:54 PM
వెల్దుర్తి రూరల్: స్థానిక పోలీస్స్టేషన్ పరిధిలోని సూదేపల్లె స్టేజ్ వద్ద ఎన్హెచ్–44పై జరిగిన రోడ్డు ప్రమాదంలో వృద్ధురాలు మృతిచెందగా ఇద్దరు గాయపడ్డారు. ఎస్ఐ తులసీనాగప్రసాద్ తెలిపిన వివరాల మేరకు.. రాజస్థాన్ అడిషనల్ డీజీగా బాధ్యతలు నిర్వహిస్తున్న ఐపీఎస్ అధికారి ఎన్. రవీంద్రకుమార్రెడ్డి తల్లి మాణిక్యమ్మ (82)..కర్నూలు రెవిన్యూ కాలనీలో ఉంటున్నారు. ఆమె చెల్లెలు రాజమ్మతో కలిసి సీతారామాపురం కాశిరెడ్డినాయన ఆశ్రమంలో అన్నదాన కార్యక్రమం నిర్వహించే కారులో బయలుదేరారు.మధ్యాహ్నం 3గంటల ప్రాంతంలో కుక్క అడ్డరావడంతో కారు బోల్తా పడింది. ప్రమాదంలో మాణిక్యమ్మ, రాజమ్మలు తీవ్రంగా గాయపడగా, డ్రైవర్ నరేంద్రారెడ్డికి స్వల్ప గాయాలపాలయ్యాడు. ప్రమాదాన్ని గుర్తించిన స్థానికులు, వాహనదారుల 108 సమాచారం ఇచ్చారు. వాహనంలో క్షతగాత్రులను కర్నూలు ఆసుపత్రికి తరలించేలోపు మాణిక్యమ్మ మృతిచెందగా, రాజమ్మ గౌరీగోపాల్ ఆసుపత్రిలో చికిత్సపొందుతోంది. పూర్తివివరాలు సేకరించి కేసు నమోదు చేయనున్నట్లు ఎస్ఐ తెలిపారు.
Advertisement
Advertisement