మిర్యాలగూడ అర్బన్ : ప్రేమ వివాహం చేసుకున్న యువతి కిడ్నాపైన సంఘటన గురువారం పట్టణంలోని సుందర్నగర్లో చోటు చేసుకుంది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం పట్టణంలోని సుందర్నగర్కు చెందిన గుంటిపల్లి మల్లయ్య, మంగమ్మ కుమారుడు నరేందర్, విద్యానగర్ కాలనీకి చెందిన రున్యాల కరణ్సింగ్ పెద్ద కుమార్తె దీప మూడు సంవత్సరాలుగా ప్రేమించుకుంటున్నారు. వీరి ప్రేమ విషయం తెలుసుకున్న పెద్దలు వారి ప్రేమను అంగీకరించకపోగా అమ్మారుు తల్లిదండ్రులు మరొక వ్యక్తితో పెళ్లి చేయడానికి ప్రయత్నించారు. దీంతో వారు నల్లగొండలోని ఆర్యసమాజ్ మందిరంలో గతనెల 22వ తేదీన వివాహం చేసుకున్నారు. అనంతరం జిల్లా ఎస్పీ ప్రకాశ్రెడ్డిని ఆశ్రయించారు.
వారి వివరాలు తెలుసుకున్న ఎస్పీ మిర్యాలగూడ వన్టౌన్ స్టేషన్కు సమాచారం అందించి వారికి పూర్తి రక్షణ కల్పించాలని ఆదేశించారు. అదేరోజు సాయంత్రం ఇరువురి తల్లిదండ్రులను స్టేషన్కు పిలిపించి పోలీసులు వారికి కౌన్సెలింగ్ ఇచ్చారు. అనంతరం ఆ జంట హైదరాబాద్లో ఉంటూ జీవనం సాగిస్తున్నారు. గురువారం ఉదయం ఆ జంట సుందర్నగర్లోని అబ్బాయి నరేందర్ ఇంటికి వచ్చారు. వారు వచ్చిన విషయం తెలుసుకున్న అమ్మా తల్లిదండ్రులు, బంధువులు సుమారు ఇరువై మంది ఇంటిపై దాడిచేసి కుటుంబ సభ్యులను తీవ్రంగా గాయపరిచి అమ్మాయిని బలవంతంగా తీసుకెళ్లినట్లు బాధితుడు నరేందర్ తెలిపారు. బాధితుడి ఫిర్యాదు మేరకు అమ్మారుు తల్లిదండ్రులపై కిడ్నాప్ కేసు నమోదు చేసినట్లు ఎస్ఐ డి.విజయ్కుమార్ తెలిపారు. కాగా బాధితుడు నరేందర్ మాట్లాడుతూ తనకు కూడా ప్రాణహాని ఉందని, రక్షణ కల్పించాలని వేడుకున్నాడు.
ప్రేమ వివాహం చేసుకున్న యువతి కిడ్నాప్
Published Fri, Dec 9 2016 10:40 PM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
బీజేపీతోనే దేశ భద్రత, అభివృద్ధి
పటాన్చెరుపై పట్టెవరిదో?
బీఆర్ఎస్, కాంగ్రెస్ చేసిందేమీ లేదు
No Headline
అదనపు పోలింగ్ సిబ్బందికి శిక్షణ
బీజేపీ, టీడీపీ, జనసేన తోడు దొంగలు..!
అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
గాజువాకలో సీఎం రోడ్ షో, పాత గాజువాక సెంటర్లో ప్రారంభమైన బహిరంగ సభ (ఫోటోలు)
దర్శకుడిగా మారిన ప్రముఖ ఫోటోగ్రాఫర్
సడెన్గా మిస్ యూఎస్ఏ స్థానం నుంచి తప్పుకుంటున్న మోడల్!కారణం ఇదే..
తప్పక చదవండి
- అదిరిపోయిన అందాలు.. తృప్తి అలా ఆయేషా ఇలా!
- ఓటుకు నోటు..అజిత్ పవార్ వర్గంపై నాన్ కాగ్నిజబుల్ కేసు నమోదు
- తెలంగాణ: రైతుబంధుకు ‘ఈసీ’ బ్రేక్
- ‘చార్ సౌ పార్’ ఎందుకంటే... క్లారిటీ ఇచ్చిన ప్రధాని
- దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- PK: అన్నయ్య ప్రచారం చేస్తే తప్ప గెలవలేడా?
- తుప్పు పట్టిన సైకిల్లో మిగిలింది బెల్ మాత్రమే: సీఎం జగన్
- LS Elections: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్.. ఓటింగ్ శాతం ఎంతంటే..
Advertisement