కేసీఆర్ వెంట ఆ ముగ్గురు మంత్రులు | KCR to helicopter to Amaravathi | Sakshi
Sakshi News home page

కేసీఆర్ వెంట ఆ ముగ్గురు మంత్రులు

Oct 22 2015 8:01 AM | Updated on Aug 15 2018 9:30 PM

కేసీఆర్ వెంట ఆ ముగ్గురు మంత్రులు - Sakshi

కేసీఆర్ వెంట ఆ ముగ్గురు మంత్రులు

తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం 10.15 గంటలకు హెలికాప్టర్లో అమరావతికి వెళ్లనున్నారు.

నల్గొండ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్ గురువారం ఉదయం 10.15 గంటలకు హెలికాప్టర్లో అమరావతికి వెళ్లనున్నారు. ఆయన వెంటనే డిప్యూటీ సీఎం మహమూద్ అలీతోపాటు ఈటల రాజేందర్, జగదీష్రెడ్డి కూడా వెళ్లనున్నారని సమాచారం. శంకుస్థాపన కార్యక్రమం పూర్తయిన తర్వాత మధ్యాహ్నం 2.40 గం.లకు కేసీఆర్ ఆయన మంత్రి వర్గ సహచరులు సూర్యాపేటకు తిరుగుప్రయాణం అవుతారు. ఆ తర్వాత నల్గొండ జిల్లాలోని ఎర్రవెల్లిలో డబుల్ బెడ్ రూం ఇళ్లకు కేసీఆర్ శంకుస్థాన చేయనున్నారు. 

బుధవారం సాయంత్రమే కేసీఆర్ కారులో సూర్యాపేట చేరుకున్న సంగతి తెలిసిందే. రాత్రికి జగదీష్ రెడ్డి నివాసంలో బస చేశారు. అమరావతి శంకుస్థాపన నేపథ్యంలో విజయవాడ పరిసర ప్రాంతాలు ట్రాఫిక్ రద్దీ ఏర్పడే అవకాశం ఉంది. ఈ నేపథ్యంలో  కేసీఆర్ బుధవారం సాయంత్రమే  సూర్యాపేటకు పయనమయ్యారు.  అక్కడి నుంచి హెలికాప్టర్ లో కేసీఆర్ తో పాటు ముగ్గురు మంత్రులు అమరావతి చేరుకుంటారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement