► అందుబాటులో విత్తనాలు, ఎరువులు
► రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దు
► వారంలో రుణ ప్రణాళిక ఖరారు
► బ్యాంకులు రుణాలివ్వకుంటే మా దృష్టికి తీసుకురావాలి
► సాగు సమస్యల పరిష్కారానికి ప్రత్యేక సెల్
► 72888 4486, 08682 244560 నంబర్లలో సంప్రదించాలి
► జిల్లా వ్యవసాయాధికారి బి.నర్సింహారావు
నల్లగొండ అగ్రికల్చర్ : ‘తొలకరి పలకరించింది.. మరో రెండు, మూడు రోజుల్లో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణ శాఖ చెబుతోంది. రైతులు ఇప్పటికే కొన్ని ప్రాంతాల్లో దుక్కులు దున్నుకుని ఖరీఫ్ సాగుకు సిద్ధంగా ఉన్నారు. ఈ మేరకు జిల్లా వ్యవసాయ శాఖ సర్వసన్నద్ధంగా ఉంది.’ అని అంటున్నారు జిల్లా వ్యవసాయాధికారి బి.నర్సింహారావు.
రైతులకు అవసరమైన విత్తనాలు, ఎరువులను సకాలంలో అందుబాటులో ఉంచడానికి పక్కా ప్రణాళికతో ముందుకు సాగుతున్నామని స్పష్టం చేశారు. గత ఖరీఫ్లో ఎదురైన సవాళ్లను దృష్టిలో పెట్టుకుని రైతులకు ఎలాంటి సమస్యలు ఉత్పన్నం కాకుండా తగు జాగ్రత్తలు తీసుకుంటున్నామని వివరించారు. జిల్లాలో రైతులు ఏరువాకకు సిద్ధమవుతున్న సందర్భంగా ఆయన మంగళవారం ‘సాక్షి’కి ప్రత్యేక ఇంటర్వూ్య ఇచ్చారు. నరసింహారావు ఏమంటున్నారో ఆయన మాటల్లోనే..
సాగు అంచనా..
జిల్లాలో ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 2,70,256 హెక్టార్లు కాగా.. ఈ ఖరీఫ్లో వర్షాలు సకాలంలో కురిస్తే జిల్లా వ్యాప్తంగా సుమారు 3,27,650 హెక్టార్లలో రైతులు వివిధ పంటలను సాగు చేసే అవకాశం ఉంది. ఇందులో ప్రధానంగా పత్తి 2,35,000 హెక్టార్లు, వరి 70,000 హెక్టార్లు, కంది 14,000 హెక్టార్లు, పెసర 3,500 హెక్టార్లు, వేరుశనగ 1,500 హెక్టార్లు, ఆముదం 1,50,000 హెక్లార్లతోపాటు ఇతర పంటలు సాగు చేసే అవకాశం ఉంటుంది.
వరి ఇతర విత్తనాలు..
జిల్లాలో రైతులకు 15,285 క్వింటాళ్ల విత్తనాలను సబ్సిడీపై అందించడానికి ఏర్పాట్లు చేశాం. వరి విత్తనాలు 10 వేల క్వింటాళ్లు, కంది 780 క్వింటాళ్లు, పెసర 400 క్వింటాళ్లు, వేరుశనగ 1,400 క్వింటాళ్లు, మొక్కజొన్న 80 క్వింటాళ్లు, జొన్న 50 క్వింటాళ్లు, సజ్జ 15 క్వింటాళ్లు, ఆముదం 55 క్వింటాళ్లు, జనుము 2,000 క్వింటాళ్లు, ఇతర విత్తనాలు 200 క్వింటాళ్లను సబ్సిడీపై పంపిణీ చేస్తాం. ఇప్పటికే 1,992 క్వింటాళ్ల వరి, 201 క్వింటాళ్ల కంది, 21 క్వింటాళ్ల వేరుశనగ, 614 క్వింటాళ్ల జనుము, 67 క్వింటాళ్ల పిల్లిపెసర.. మొత్తం 2,897 క్వింటాళ్ల విత్తనాలను వివిధ విక్రయ కేంద్రాల్లో అందుబాటులో ఉంచాం.
పత్తి విత్తనాలు..
ఖరీఫ్లో 3 లక్షల పత్తిగింజల ప్యాకెట్లను జిల్లాకు తెప్పించేలా చర్యలు తీసుకున్నాం. ఇప్పటికే సగానికి పైగా పత్తి విత్తనాలు మార్కెట్లోని డీలర్ల వద్ద అందుబాటులో ఉన్నాయి. రెండు, మూడు రోజుల్లో మొత్తం బీటీ పత్తి విత్తనాలు జిల్లాకు రానున్నాయి. పత్తి విత్తనాలకు ఎలాంటి కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.
ఎరువులు..
జిల్లావ్యాప్తంగా ఖరీఫ్లో లక్ష మెట్రిక్ టన్నుల వివిధ రకాల ఎరువులు అవసరమని గుర్తించాం. ఇందులో యూరియా 60 వేల మెట్రిక్ టన్నులు, డీఏపీ 20 వేల మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ ఎరువులు 20 వేల మెట్రిక్ టన్నులు అవసరమవుతాని ప్రభుత్వానికి నివేదిక అందజేశాం. జిల్లాలో ఇప్పటికే యూరియా 30,449 మెట్రిక్ టన్నులు, డీఏపీ 3,171 మెట్రిక్ టన్నులు, ఎంఓపీ 1,683 మెట్రిక్ టన్నులు, ఎస్ఎస్పీ 743 మెట్రిక్ టన్నులు, కాంప్లెక్స్ 15,967 మెట్రిక్ టన్నులు.. మొత్తం 52,014 మెట్రిక్ టన్నుల ఎరువులు వివిధ కేంద్రాల్లో అందుబాటులో ఉన్నాయి. సీజన్ ప్రారంభం కాగానే నెలనెల వారీగా అవసరమైన ఎరువులను అందుబాటులో ఉంచేలా చర్యలు చేపట్టాం.
వారంలో రుణ ప్రణాళిక..
ఖరీఫ్ రుణ ప్రణాళికను వారం రోజుల్లో రూపొందించి ఆమోదించే అవకాశం ఉంది. అయినప్పటికీ బ్యాంకర్లు.. రైతులకు ఎలాంటి ఇబ్బందులకు గురిచేయకుండా పంట రుణాలు అందజేస్తున్నారు. ఎక్కడైనా బ్యాంకర్లు పంట రుణాలు ఇవ్వకుండా ఇబ్బందులకు గురిచేస్తే మా దృష్టికి తీసుకురావాలి. వెంటనే ఆ బ్యాంకులతో మాట్లాడి రుణాలను ఇప్పించేలా చర్యలు తీసుకుంటాం.
ప్రత్యేక సెల్..
జిల్లా వ్యాప్తంగా ఎక్కడైనా విత్తనాలు, ఎరువుల సమస్యలు తలెత్తితే వెంటనే పరిష్కరించేలా వ్యవసాయ శాఖ కార్యాలయంలో ప్రత్యేక సెల్ను ఏర్పాటు చేశాం. 72888 94486, 08682 244560 ఫోన్ నంబర్లలకు సమాచారం అందించాలి. జిల్లాకు అవసరమైన అన్ని రకాల విత్తనాలు, ఎరువులు సిద్ధం చేసినందున రైతులు ఎలాంటి ఆందోళన చెందొద్దు.
ఖరీఫ్కు సిద్ధం..
Published Wed, Jun 7 2017 4:15 AM
Advertisement
మారిన క్రెడిట్ కార్డ్ నిబంధనలు.. మే 1 నుంచి అమల్లోకి..
గోబెల్స్ స్ఫూర్తితో.. ప్రధాని మోదీపై జైరాం ఆగ్రహం
ఇక ‘వందే మెట్రో’.. రైల్వే కీలక అప్డేట్
దిగ్గజ బ్యాంకర్ అభయ్ ఐమా కన్నుమూత
హైదరాబాద్లో భారీగా పెరిగిన ఆఫీస్ లీజింగ్
అతి త్వరలోనే గ్రేట్ సమ్మర్ సేల్.. స్మార్ట్ఫోన్లపై భారీ డిస్కౌంట్లు!
Shankar-Ram Charan Movie: సరికొత్త పాత్రలో చెర్రీ
నిమిషానికి 500 గంటల కంటెంట్ అప్లోడ్.. యూట్యూబ్ ప్రస్థానం ఇదే..
కొత్త రకం ఏటీఎంలు.. భారత్తో తొలిసారి
ఉత్తరాఖండ్ టూరిజం ఆధ్వర్యంలో ‘నక్షత్ర సభ’: థ్రిల్లింగ్ అనుభవం కావాలంటే!
దేశంలో పెరిగిన బంగారం ధరలు.. ఎంతంటే?
ఒక్కరోజులోనే రూ.800 కోట్లు నష్టపోయిన రేఖా ఝున్ఝున్వాలా
సీఎం జగన్ కోసం రాజానగరం సిద్ధం(ఫొటోలు)
ఓటర్లపై తేనెటీగల దాడి.. ఎనిమిదిమందికి గాయాలు!
'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
టీడీపీ నేతల దౌర్జన్యాలు అరికట్టాలి
'ఇరానీ చాయ్'ని పరిచయం చేసిందెవరో తెలుసా! ది బెస్ట్ ఎక్కడంటే..
కేజ్రీవాల్కు ఎందుకు బెయిల్ ఇవ్వొద్దు : ఈడీని ప్రశ్నించిన సుప్రీం
టీడీపీ గూండాగిరి
తప్పక చదవండి
- Rekha Jhunjhunwala: ఒక్కరోజులోనే రూ.800 కోట్ల నష్టం
- 'పుష్ప' వల్ల నాకు ఎలాంటి లాభం లేదు: ఫహాద్
- జాంబియా ప్రీ వెడ్డింగ్ వేడుక : అమ్మాయి ఇలా చేయాల్సిందే!
- ప్లే ఆఫ్స్ రేసులో ఉన్నారా? హార్దిక్ సమాధానం ఇదే!
- Met Gala 2024: తల్లికి తగ్గ కూతురు, ఇషా అంబానీగౌను తయారీకి 10 వేల గంటలు
- వయనాడ్, రాయ్బరేలీ.. గెలిస్తే రాహుల్ దేనిని వదిలేస్తారు?
- వారందరి జీవితాలను మార్చేసిన 'ఆర్య'కు 20 ఏళ్లు
- వైజాగ్ మాల్యా.. వంశీ!
- ఆగిన సునీతా విలియమ్స్ రోదసీ యాత్ర
- LS Elections 3rd Phase: కొనసాగుతున్న మూడో విడత పోలింగ్
Advertisement