చంద్రబాబు నివాసానికి గవర్నర్ | chandrababu naidu met governor narasimhan | Sakshi
Sakshi News home page

చంద్రబాబు నివాసానికి గవర్నర్

Jul 6 2016 8:38 PM | Updated on Aug 31 2018 8:26 PM

ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు.

విజయవాడ: ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు బుధవారం రాష్ట్ర గవర్నర్ నరసింహన్తో భేటీ అయ్యారు. విజయవాడలోని గేట్వే హోటల్లో ఈ సమావేశం జరిగింది. హైకోర్టు విభజన, ఇరు రాష్ట్రాల మధ్య నీటి పంపకాల అంశాలపై ఈ భేటీలో చర్చించారు. అనంతరం గవర్నర్ ను చంద్రబాబు తన నివాసంలో విందుకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఒకే వాహనంలో చంద్రబాబు, గవర్నర్ నరసింహన్ ...ఉండవల్లిలోని సీఎం అధికార నివాసానికి వెళ్లారు. కాగా గవర్నర్ ఈరోజు సాయంత్రం హైదరాబాద్ నుంచి విజయవాడ చేరుకున్న విషయం తెలిసిందే.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement